ఒమన్లో రెండు కొత్త మాల్స్ ఈ ఏడాదిలోనే!
- February 21, 2018
మస్కట్: రిటెయిల్ మరియు హాస్పిటాలిటీ సెక్టార్లో పేరుగాంచిన ల్యాండ్ మార్క్ గ్రూప్, ఒయాసిస్ మాల్ని సోహార్ మరియు సలాలాలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జీసీసీ దేశాల్లో ఏడు మాల్స్, ఫిలిప్పీన్లో నాలుగు మాల్స్ని నిర్వహిస్తున్న ఒయాసిస్ మాల్, 2018 నాటికి ఒమన్లో రెండు కొత్త బ్రాంచ్లను ప్రారంభించనుంది. సోహార్లోని అల్ వకిబా, అలాగే సలాలాలోని స్క్వేర్ జి - న్యూ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకటి ఈ ఏడాది ప్రారంభమవుతాయి. 33 చదరపు మీటర్ల వైశాల్యంలో సోహార్, 35,000 చదరపు మీటర్ల వైశాల్యంతో సలాలాలో ఈ మాల్స్ నిర్మితమవుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సర్వ హంగులతో ఈ మాల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ల్యాండ్ మార్క్ గ్రూప్కి సంబంధించి ఈ మాల్స్ అత్యంత ప్రతిష్టాత్మకమైనవని సంస్థ నిర్వాహకులు తెలిపారు. కంట్రీ ఓవరాల్ ఎకానమీకి తమవంతుగా ఊతమిచ్చేలా ఈ మాల్స్ నిర్వహణ ఉంటుందని వారు అంటున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!