ఒమన్లో రెండు కొత్త మాల్స్ ఈ ఏడాదిలోనే!
- February 21, 2018
మస్కట్: రిటెయిల్ మరియు హాస్పిటాలిటీ సెక్టార్లో పేరుగాంచిన ల్యాండ్ మార్క్ గ్రూప్, ఒయాసిస్ మాల్ని సోహార్ మరియు సలాలాలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జీసీసీ దేశాల్లో ఏడు మాల్స్, ఫిలిప్పీన్లో నాలుగు మాల్స్ని నిర్వహిస్తున్న ఒయాసిస్ మాల్, 2018 నాటికి ఒమన్లో రెండు కొత్త బ్రాంచ్లను ప్రారంభించనుంది. సోహార్లోని అల్ వకిబా, అలాగే సలాలాలోని స్క్వేర్ జి - న్యూ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకటి ఈ ఏడాది ప్రారంభమవుతాయి. 33 చదరపు మీటర్ల వైశాల్యంలో సోహార్, 35,000 చదరపు మీటర్ల వైశాల్యంతో సలాలాలో ఈ మాల్స్ నిర్మితమవుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సర్వ హంగులతో ఈ మాల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ల్యాండ్ మార్క్ గ్రూప్కి సంబంధించి ఈ మాల్స్ అత్యంత ప్రతిష్టాత్మకమైనవని సంస్థ నిర్వాహకులు తెలిపారు. కంట్రీ ఓవరాల్ ఎకానమీకి తమవంతుగా ఊతమిచ్చేలా ఈ మాల్స్ నిర్వహణ ఉంటుందని వారు అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







