రెజీనా బాలీవుడ్లో ఎంట్రీ
- February 21, 2018
హైదరాబాద్ : దక్షిణాది నుంచి త్రిష, కాజల్ అగర్వాల్తో పాటు పలువురు కథానాయికలు హిందీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా రెజీనా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నది. రాజ్కుమార్రావ్, సోనమ్కపూర్ ప్రధాన పాత్రల్లో ఎక్ లడికీ కో దేఖాతో ఐసా లగా పేరుతో ఓ మూవీ తెరకెక్కుతున్నది. విధు వినోద్చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి షెల్లీ చోప్రా ధార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో రెజీనా నటించనున్నది. గత కొంతకాలంగా తెలుగు, తమిళ భాషల్లో నటనకు ఆస్కారమున్న పాత్రల్లో కనిపిస్తున్నది రెజీనా. ఈ చిత్రాల్లో రెజీనా అభినయానికి ముగ్ధులైన బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. రెజీనాతో పాటు అనిల్కపూర్, జూహీచావ్లా ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకురానున్నది. గతంలో హిందీ చిత్రం ఆంఖేన్-2లో నటించే అవకాశం రెజీనాను వరించింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా సెట్స్పైకిరాలేదు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి