వీసా కోసం చనిపోయిన వ్యక్తి సంతకం ఫోర్జరీ
- February 21, 2018
50 ఏళ్ళ వ్యక్తి ఒకరు, చనిపోయిన వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. మృతుడు జిసిసి జాతీయుడు కాగా, అతని పేరు మీద వీసా పొందేందుకు ప్రయత్నించాడు నిందితుడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు అఫీషియల్ డాక్యుమెంట్ స్టాంపింగ్ అయ్యాక, ఆ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. షార్జా న్యాయస్థానం ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ళు జైలు శిక్ష విధించింది గత డిసెంబర్లో. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ - షార్జాలో ఫోర్జరీ చేసిన దరఖాస్తుని నిందితుడు సమర్పించాడు. మహమౌద్ పేరుతో నిందితుడు ఈ డాక్యుమెంట్ని ఇచ్చాడు. తన రెసిడెన్స్ వీసాని రెన్యువల్ చేయడానికి ప్రయత్నించాను తప్ప, ఎలాంటి నేరానికి పాల్పడలేదని నిందితుడు చెప్పగా, నిందితుడి తరఫు లాయర్ సలెమ్ సాహో తన క్లయింట్ని బెయిల్పై విడుదల చేయాలని కోర్టుకి విజ్ఞప్తి చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







