వీసా కోసం చనిపోయిన వ్యక్తి సంతకం ఫోర్జరీ
- February 21, 2018
50 ఏళ్ళ వ్యక్తి ఒకరు, చనిపోయిన వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. మృతుడు జిసిసి జాతీయుడు కాగా, అతని పేరు మీద వీసా పొందేందుకు ప్రయత్నించాడు నిందితుడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు అఫీషియల్ డాక్యుమెంట్ స్టాంపింగ్ అయ్యాక, ఆ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. షార్జా న్యాయస్థానం ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ళు జైలు శిక్ష విధించింది గత డిసెంబర్లో. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ - షార్జాలో ఫోర్జరీ చేసిన దరఖాస్తుని నిందితుడు సమర్పించాడు. మహమౌద్ పేరుతో నిందితుడు ఈ డాక్యుమెంట్ని ఇచ్చాడు. తన రెసిడెన్స్ వీసాని రెన్యువల్ చేయడానికి ప్రయత్నించాను తప్ప, ఎలాంటి నేరానికి పాల్పడలేదని నిందితుడు చెప్పగా, నిందితుడి తరఫు లాయర్ సలెమ్ సాహో తన క్లయింట్ని బెయిల్పై విడుదల చేయాలని కోర్టుకి విజ్ఞప్తి చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







