వీసా కోసం చనిపోయిన వ్యక్తి సంతకం ఫోర్జరీ

- February 21, 2018 , by Maagulf
వీసా కోసం చనిపోయిన వ్యక్తి సంతకం ఫోర్జరీ

50 ఏళ్ళ వ్యక్తి ఒకరు, చనిపోయిన వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. మృతుడు జిసిసి జాతీయుడు కాగా, అతని పేరు మీద వీసా పొందేందుకు ప్రయత్నించాడు నిందితుడు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు అఫీషియల్‌ డాక్యుమెంట్‌ స్టాంపింగ్‌ అయ్యాక, ఆ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. షార్జా న్యాయస్థానం ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ళు జైలు శిక్ష విధించింది గత డిసెంబర్‌లో. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ మరియు ఫారిన్‌ ఎఫైర్స్‌ - షార్జాలో ఫోర్జరీ చేసిన దరఖాస్తుని నిందితుడు సమర్పించాడు. మహమౌద్‌ పేరుతో నిందితుడు ఈ డాక్యుమెంట్‌ని ఇచ్చాడు. తన రెసిడెన్స్‌ వీసాని రెన్యువల్‌ చేయడానికి ప్రయత్నించాను తప్ప, ఎలాంటి నేరానికి పాల్పడలేదని నిందితుడు చెప్పగా, నిందితుడి తరఫు లాయర్‌ సలెమ్‌ సాహో తన క్లయింట్‌ని బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టుకి విజ్ఞప్తి చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com