సైక్లింగ్ క్లబ్ కు ఎదురుదెబ్బ...రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

- February 22, 2018 , by Maagulf
సైక్లింగ్ క్లబ్ కు ఎదురుదెబ్బ...రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

జజాన్ : వేగంగా..నిర్లక్ష్యంగా వాహనాలను నడిపే  డ్రైవర్ కారణంగా  సైక్లింగ్ క్లబ్ మార్గంలో సరైన భద్రత నిబంధనలను అనుసరించని నేపథ్యంలో తమ పిల్లలకు హాని జరిగిందని చనిపోయిన సైక్లిస్టులతల్లిదండ్రులు క్లబ్ నిర్వహణ తీరుని నిందించారు. సోమవారం సాయంత్రం అబూ అరెష్ గవర్నరేట్ పరిధిలో జరిగిన భయంకరమైన ప్రమాదంలో సాధారణ సైక్లింగ్ విహారం జరుపుతున్న అల్-యరమౌక్  సైక్లింగ్ క్లబ్ యొక్క నల్గురు సభ్యులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మరో ఆరుగురు సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. "  రోజు మాదిరిగానే  30 మంది సైక్లిస్టల బృందం ప్రతిరోజూ ఒక ప్రదేశానికి చేరుకుంటుంది మరియు మా సైకిళ్లను ఒక పక్కగా వెళుతున్నామని ఆ మార్గంలో ప్రత్యేకంగా తమ కోసం ప్రత్యేక దారులు లేవని 15 ఏళ్ల మెహ్మోద్ ఇబ్రహీం పేర్కొంటున్నారు. ఈ బాలుడు తనకు  పొత్తికడుపులో తగిలిన దెబ్బతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఫులద్ సాలెహ్ అనే మరో 16 ఏళ్ళ బాలుడిని కారు డీ కొనడంతో సంఘటన స్థలంలో స్పృహ కోల్పోయాడు గంటల తరువాత మేల్కొన్నప్పుడు ఆ బాలుడితో చైతన్యం కోల్పోయాడు. ఈ తరహా రోడ్డు ప్రమాదం సైక్లింగ్ క్లబ్ సభ్యులకు రెండుసార్లు అనుభవం అయింది. అయితే ఈసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో వేగంగా దూసుకువస్తున్న ఒక ట్రక్ డీ కొన్న కారణంగా క్లబ్ నలుగురు సభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగానే మార్గమధ్యలోనే  మరణించారు. . 25 సంవత్సరాల ఒక సైక్లిస్ట్ వ్ వలేద్ అల్-సేయెడ్, ఈ దారుణ ప్రమాదంలో నా స్నేహితులను కోల్పోయేయానని చెప్పాడు.బాధితులలో ఒకరు బంధువు ఖలీద్ హజసీ, అల్-యర్మక్ క్లబ్ ను సరైన భద్రతా ప్రమాణాలతో నిర్వహించకపోవడం ఒక ముఖ్య కారణమని ఆరోపించారు. "చాలామంది బాధితులు పాఠశాలలో నా విద్యార్ధులు. ప్రమాదం జరిగిన ఆ ప్రాంతంలో  అంబులెన్స్ లేదు, ట్రాఫిక్ ను నిర్వహించటానికి ట్రాఫిక్ పోలీసులు సైతం లేరని హజజీ చెప్పాడు.అలాగే అహ్మద్ అబ్దుల్లా తన 15 ఏళ్ల కుమారుడు ప్రమాదం లో పాదం విరిగిందని ఒక తండ్రి  అన్నారు. "నేను నా కుమారుడు ఇకపై క్లబ్ ఛాయలలోనికి వెళ్లనివ్వను. వారు కనీసం  ప్రాథమిక భద్రతా నిబంధనలను అనుసరించరని పేర్కొన్నాడు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com