తెలంగాణలోని జీనోమ్ వ్యాలీ క్లస్టర్ ఆసియాలోనే అతిపెద్దది: మంత్రి కేటీఆర్
- February 22, 2018తెలంగాణలో సులభతర వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. జీనోమ్ వ్యాలీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో బయో ఏషియా సదస్సును కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సు మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ సదస్సుకు 52 దేశాల నుంచి 1600 మంది ప్రతినిధులు తరలివచ్చారు. రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీ క్లస్టర్ ఆసియాలోనే అతిపెద్దదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. జీనోమ్ వ్యాలీకి ఫార్మా కంపెనీలను ఆహ్వానిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధికి ప్రభుత్వం మరింత దృష్టి పెట్టిందన్న కేటీఆర్.. లైఫ్ సైన్సెస్ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు