రంగస్థలం చిత్రంలోని ఎంత సక్కగున్నావే పాటనుచంద్రబోస్ ఎంత సక్కగ రాసిండే .. 'వంశీ కమల్'

- February 22, 2018 , by Maagulf
రంగస్థలం చిత్రంలోని ఎంత సక్కగున్నావే పాటనుచంద్రబోస్ ఎంత సక్కగ రాసిండే .. 'వంశీ కమల్'

చెర్రీ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రంగస్థలం ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఈ చిత్రంలోని ఎంత సక్కగున్నావే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూయర్ షిప్‌ని సొంతం చేసుకుంది. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు పదాలతో చంద్రబోస్ ఎంతబాగా రాశాడు అని అనుకోని తెలుగు వారుండరు. ఈ పాటకు చక్కటి మ్యూజిక్ అందించి అంతే అందంగా పాడాడా డీఎస్పీ. ఓ అభిమాని ఈ పాటకు ప్రభావితుడై అందమైన పేరడీ కట్టాడు. పాట రాసిన చంద్రబోస్‌ని తన పదాల ద్వారా ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ పాటను రంగస్థలం డైరక్టర్ సుకుమార్ ప్రమోట్ చేశాడు. కళాత్మకంగా రాశావంటూ రైటర్ వంశీ కమల్‌ని ప్రశంసించాడు సుకుమార్. చంద్రబోస్‌కూడా వంశీ పాటకు ఫిదా అయ్యానంటూ మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు ఈ పాటకూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com