శ్రీదేవి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన
- February 24, 2018
విశాఖపట్టణం: అందాల తార శ్రీదేవి(54) గుండెపోటుతో మరణించారు. దుబాయిలో ఓ వివాహ వేడుకకి హాజరైన ఆమె.. శనివారం రాత్రి అక్కడే తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మరణవార్తను విన్న అభిమానులు, సినీ ప్రముఖులు షాక్కు గురవుతున్నారు. కాగా... శ్రీదేవి మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశాఖలో చంద్రబాబునాయుడు ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... బహుభాషా నటిగా, ముఖ్యంగా తెలుగువారికి అత్యంత ఇష్టమైన కథానాయకగా ఎదిగారని అన్నారు. అసమానమైన తన అభినయంతో దేశం గర్వించదగ్గ నటిగా నిలిచిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి