శ్రీదేవి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన
- February 24, 2018
విశాఖపట్టణం: అందాల తార శ్రీదేవి(54) గుండెపోటుతో మరణించారు. దుబాయిలో ఓ వివాహ వేడుకకి హాజరైన ఆమె.. శనివారం రాత్రి అక్కడే తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మరణవార్తను విన్న అభిమానులు, సినీ ప్రముఖులు షాక్కు గురవుతున్నారు. కాగా... శ్రీదేవి మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశాఖలో చంద్రబాబునాయుడు ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... బహుభాషా నటిగా, ముఖ్యంగా తెలుగువారికి అత్యంత ఇష్టమైన కథానాయకగా ఎదిగారని అన్నారు. అసమానమైన తన అభినయంతో దేశం గర్వించదగ్గ నటిగా నిలిచిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







