ఆఖరి క్షణాల్లో శ్రీదేవి ఏం చేసిందంటే..
- February 25, 2018
ఇండియన్ సినిమా స్క్రీన్పై తొలి లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న శ్రీదేవి, శనివారం అర్థరాత్రి దుబాయ్లో తుది శ్వాస విడిచారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వచ్చిన శ్రీదేవి, హఠాన్మరణం చెందడం అందర్నీ కలచివేస్తోంది. చనిపోవడానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగిందనే విషయానికి సంబంధించి పూర్తి స్పష్టత లేకపోయినా, డిన్నర్కి రెడీ అయ్యే సందర్భంలో వాష్ రూమ్కి వెళ్ళిన శ్రీదేవికి అక్కడే గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. అందకు ముందు భర్త బోనీ కపూర్తో కలిసి కాస్సేపు ముచ్చటించిన శ్రీదేవి, వాష్రూమ్కి వెళ్ళారనీ, అయితే 15 నిమిషాలు దాటినా వాష్రూమ్లోంచి ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త బోనీకపూర్, ఆమె కోసం వాష్రూమ్లోకి వెళ్ళి చూస్తే, అక్కడ బాత్ టబ్లో అచేతనావస్థలో ఆమె పడి ఉందనీ, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందారనీ తెలుస్తోంది. నెఫ్యూ మొహిత్ మార్వా వివాహ వేడుక కోసం బోనీకపూర్, శ్రీదేవి, వారి కుమార్తె ఖుషీ దుబాయ్ వచ్చారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి







