ఆఖరి క్షణాల్లో శ్రీదేవి ఏం చేసిందంటే..

- February 25, 2018 , by Maagulf
ఆఖరి క్షణాల్లో శ్రీదేవి ఏం చేసిందంటే..

ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై తొలి లేడీ సూపర్‌ స్టార్‌ అనిపించుకున్న శ్రీదేవి, శనివారం అర్థరాత్రి దుబాయ్‌లో తుది శ్వాస విడిచారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్‌ వచ్చిన శ్రీదేవి, హఠాన్మరణం చెందడం అందర్నీ కలచివేస్తోంది. చనిపోవడానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగిందనే విషయానికి సంబంధించి పూర్తి స్పష్టత లేకపోయినా, డిన్నర్‌కి రెడీ అయ్యే సందర్భంలో వాష్‌ రూమ్‌కి వెళ్ళిన శ్రీదేవికి అక్కడే గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. అందకు ముందు భర్త బోనీ కపూర్‌తో కలిసి కాస్సేపు ముచ్చటించిన శ్రీదేవి, వాష్‌రూమ్‌కి వెళ్ళారనీ, అయితే 15 నిమిషాలు దాటినా వాష్‌రూమ్‌లోంచి ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త బోనీకపూర్‌, ఆమె కోసం వాష్‌రూమ్‌లోకి వెళ్ళి చూస్తే, అక్కడ బాత్‌ టబ్‌లో అచేతనావస్థలో ఆమె పడి ఉందనీ, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందారనీ తెలుస్తోంది. నెఫ్యూ మొహిత్‌ మార్వా వివాహ వేడుక కోసం బోనీకపూర్‌, శ్రీదేవి, వారి కుమార్తె ఖుషీ దుబాయ్‌ వచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com