సాయంత్రానికి ముంబై చేరనున్న శ్రీదేవి పార్థివ దేహం
- February 25, 2018
ప్రముఖ నటి శ్రీదేవి గుండెపోటుతో దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే. పోస్ట్ మోర్టమ్ నిర్వహించిన అనంతరం ఆమె పార్థివ దేహాన్ని మార్చరీలో భద్రపరిచారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించే నివేదికతో ఆమె పార్థివ దేహాన్ని ఇండియా కు తరలించే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన అనంతరం జరిగే ప్రక్రియ:
అధికారులు ఇచ్చే డెత్ సర్టిఫికెట్ ను కుటుంబ సభ్యులు ఇండియన్ కాన్సులేట్ లో అందజేయగా కాన్సులేట్ బృందం శ్రీదేవి పాస్పోర్ట్ ను రద్దు చేస్తుంది. మరియు ఆమె పార్థివ దేహాన్ని ఎంబామ్ (రాసానాలు పూయుట) కై తరలించెదరు. ఇమ్మిగ్రేషన్ వారు మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పోలీసు డిపార్ట్మెంట్ మరియి న్యాయవాది 'నో అబ్జెక్షన్' పత్రాలు ఇవ్వగానే పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో ముంబై కి తరలిస్తారు.
ఫోరెన్సిక్ రిపోర్ట్ దుబాయ్ కాలమానం ప్రకారం 11 గంటల సమయంలో రావచ్చని భావిస్తున్నారు. అనంతరం ఎంబామ్ ప్రక్రియ ఒక గంటన్నర సమయం పడుతుంది కాగా పార్థివ దేహాన్ని ముంబై తరలించటం 1 గంటకు అవ్వచ్చని అంచనా. సాయంత్రానికి శ్రీదేవి పార్థివ దేహం ముంబై కి చేరుతుందని, సమయానుకూలంగా నేటి సాయంత్రం లేదా మరుసటి ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







