సాయంత్రానికి ముంబై చేరనున్న శ్రీదేవి పార్థివ దేహం
- February 25, 2018
ప్రముఖ నటి శ్రీదేవి గుండెపోటుతో దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే. పోస్ట్ మోర్టమ్ నిర్వహించిన అనంతరం ఆమె పార్థివ దేహాన్ని మార్చరీలో భద్రపరిచారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించే నివేదికతో ఆమె పార్థివ దేహాన్ని ఇండియా కు తరలించే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన అనంతరం జరిగే ప్రక్రియ:
అధికారులు ఇచ్చే డెత్ సర్టిఫికెట్ ను కుటుంబ సభ్యులు ఇండియన్ కాన్సులేట్ లో అందజేయగా కాన్సులేట్ బృందం శ్రీదేవి పాస్పోర్ట్ ను రద్దు చేస్తుంది. మరియు ఆమె పార్థివ దేహాన్ని ఎంబామ్ (రాసానాలు పూయుట) కై తరలించెదరు. ఇమ్మిగ్రేషన్ వారు మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పోలీసు డిపార్ట్మెంట్ మరియి న్యాయవాది 'నో అబ్జెక్షన్' పత్రాలు ఇవ్వగానే పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో ముంబై కి తరలిస్తారు.
ఫోరెన్సిక్ రిపోర్ట్ దుబాయ్ కాలమానం ప్రకారం 11 గంటల సమయంలో రావచ్చని భావిస్తున్నారు. అనంతరం ఎంబామ్ ప్రక్రియ ఒక గంటన్నర సమయం పడుతుంది కాగా పార్థివ దేహాన్ని ముంబై తరలించటం 1 గంటకు అవ్వచ్చని అంచనా. సాయంత్రానికి శ్రీదేవి పార్థివ దేహం ముంబై కి చేరుతుందని, సమయానుకూలంగా నేటి సాయంత్రం లేదా మరుసటి ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









