సాయంత్రానికి ముంబై చేరనున్న శ్రీదేవి పార్థివ దేహం
- February 25, 2018
ప్రముఖ నటి శ్రీదేవి గుండెపోటుతో దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే. పోస్ట్ మోర్టమ్ నిర్వహించిన అనంతరం ఆమె పార్థివ దేహాన్ని మార్చరీలో భద్రపరిచారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించే నివేదికతో ఆమె పార్థివ దేహాన్ని ఇండియా కు తరలించే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన అనంతరం జరిగే ప్రక్రియ:
అధికారులు ఇచ్చే డెత్ సర్టిఫికెట్ ను కుటుంబ సభ్యులు ఇండియన్ కాన్సులేట్ లో అందజేయగా కాన్సులేట్ బృందం శ్రీదేవి పాస్పోర్ట్ ను రద్దు చేస్తుంది. మరియు ఆమె పార్థివ దేహాన్ని ఎంబామ్ (రాసానాలు పూయుట) కై తరలించెదరు. ఇమ్మిగ్రేషన్ వారు మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పోలీసు డిపార్ట్మెంట్ మరియి న్యాయవాది 'నో అబ్జెక్షన్' పత్రాలు ఇవ్వగానే పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో ముంబై కి తరలిస్తారు.
ఫోరెన్సిక్ రిపోర్ట్ దుబాయ్ కాలమానం ప్రకారం 11 గంటల సమయంలో రావచ్చని భావిస్తున్నారు. అనంతరం ఎంబామ్ ప్రక్రియ ఒక గంటన్నర సమయం పడుతుంది కాగా పార్థివ దేహాన్ని ముంబై తరలించటం 1 గంటకు అవ్వచ్చని అంచనా. సాయంత్రానికి శ్రీదేవి పార్థివ దేహం ముంబై కి చేరుతుందని, సమయానుకూలంగా నేటి సాయంత్రం లేదా మరుసటి ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి