అక్కా నాబిడ్డని నువ్వే చూసుకో.. సోదరికి మెసేజ్
- February 26, 2018
అక్కా నాబిడ్డని నువ్వే చూసుకో.. నేను వెళ్లి పోతున్నాను.. ఈ బాధల్ని భరించలేను.. అంటూ అమెరికాలో ఉన్న తన సోదరికి మెసేజ్ పెట్టి ఉరి వేసుకుని తనువు చాలించింది ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి. కర్ణాటకలోని కోలారు జిల్లాకు చెందిన రశ్మీ, బెంగుళూరుకు చెందిన సతీష్ ప్రేమించుకున్నారు. మూడు సంవత్సారల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇద్దరూ సాప్ట్ వేర్ ఉద్యోగులుగా ప్రముఖ కంపెనీల్లో పని చేస్తున్నారు. అనంతరం బాబు పుట్టాడు. ఈ నేపద్యంలో శనివారం సతీష్ భార్యని, బాబుని వదిలి కోలూరు జిల్లాలోని సొంత ఊరుకు వెళ్లాడు. ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రశ్మి అమెరికాలో ఉన్న సోదరికి మెసేజ్ పెట్టింది. బాబుని జాగ్రత్తగా చూసుకోమంటూ. మెసేజ్ చూసిన వెంటనే బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి అర్జెంటుగా చెల్లి దగ్గరకు వెళ్లమంటూ చెప్పింది. తల్లి దండ్రులు చేరుకునే లోపే రశ్మి సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురి మృతికి అల్లుడు, అత్తే కారణమంటూ తల్లి ఆరోపణలు చేస్తోంది. వరకట్న వేధింపుల వల్లే మరణించిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







