మెగా స్కాం: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ పి.న్.బి మరో కీలక ప్రకటన
- February 26, 2018
ముంబై: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా పేరొందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కాంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ చెబుతున్నట్టుగా రూ .11,400 కోట్ల రూపాయల మోసమేకాకుండా రూ. 1,300 కోట్ల (204 డాలర్లు) అక్రమ లావాదేవీలు జరిగాయని పీఎన్బీ తాజాగా వెల్లడించింది. ఫలితంగా ఈ కుంభకోణం మొత్తం రూ.12,622 కోట్లకు చేరుకుందని తెలిపింది.
సోమవారం రాత్రి బిఎస్ఇకి అందించిన సమాచారం ప్రకారం బ్యాంకులో మరో అనధికార లావాదేవీలు రూ .1,300 కోట్లకు పైగా గుర్తించింది. దీంతో కరెంట్ ఎక్స్ఛేంజ్ రేటులో మొత్తం రు. 1,323 కోట్లుగా ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్లో పీఎన్బీ తెలిపింది. డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువు, వ్యాపార భాగస్వామి, మెహుల్ చోక్సీతో కలిసి రూ.1,322 కోట్ల మేర అనధికారిక లావాదేవీలు నిర్వహించినట్టు బ్యాంకు పేర్కొంది.
మరోవైపు ఈ మెగా స్కాంలో కీలక నిందితులుగా ఉన్న నీరవ్ మోదీ, చోక్సీ మాత్రమే కాదు. కంపెనీకి చెందిన కీలక ఎగ్జిక్యూటివ్లు కూడా విదేశాలు చెక్కేసినట్టు తాజాగా తెలిసింది. అటు దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ, సీబీఐ మరింత చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నీరవ్మోదీ విదేశీ ఆస్తులను సీజ్ చేసేందుకు ఈడీ కసరత్తును ముమ్మరం చేస్తోంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







