మెగా స్కాం: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ పి.న్.బి మరో కీలక ప్రకటన
- February 26, 2018
ముంబై: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా పేరొందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కాంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ చెబుతున్నట్టుగా రూ .11,400 కోట్ల రూపాయల మోసమేకాకుండా రూ. 1,300 కోట్ల (204 డాలర్లు) అక్రమ లావాదేవీలు జరిగాయని పీఎన్బీ తాజాగా వెల్లడించింది. ఫలితంగా ఈ కుంభకోణం మొత్తం రూ.12,622 కోట్లకు చేరుకుందని తెలిపింది.
సోమవారం రాత్రి బిఎస్ఇకి అందించిన సమాచారం ప్రకారం బ్యాంకులో మరో అనధికార లావాదేవీలు రూ .1,300 కోట్లకు పైగా గుర్తించింది. దీంతో కరెంట్ ఎక్స్ఛేంజ్ రేటులో మొత్తం రు. 1,323 కోట్లుగా ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్లో పీఎన్బీ తెలిపింది. డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువు, వ్యాపార భాగస్వామి, మెహుల్ చోక్సీతో కలిసి రూ.1,322 కోట్ల మేర అనధికారిక లావాదేవీలు నిర్వహించినట్టు బ్యాంకు పేర్కొంది.
మరోవైపు ఈ మెగా స్కాంలో కీలక నిందితులుగా ఉన్న నీరవ్ మోదీ, చోక్సీ మాత్రమే కాదు. కంపెనీకి చెందిన కీలక ఎగ్జిక్యూటివ్లు కూడా విదేశాలు చెక్కేసినట్టు తాజాగా తెలిసింది. అటు దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ, సీబీఐ మరింత చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నీరవ్మోదీ విదేశీ ఆస్తులను సీజ్ చేసేందుకు ఈడీ కసరత్తును ముమ్మరం చేస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి