ఇండోనేషియా సముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం

- February 27, 2018 , by Maagulf
ఇండోనేషియా సముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం

జకర్తా, ఫిబ్రవరి 26: తూర్పు ఇండోనేషియాలో సోమవారం నాడు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1 గా నమోదైనట్లు అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది. ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. రాజధానికి వాయవ్యంగా 194 కిలోమీటర్ల దూరంలోని అంబన్ వద్ద సముద్రంలో 11.9 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు సంభవించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే స్పష్టం చేసింది. దీని కారణంగా ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం రాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com