శ్రీదేవి మృతి కేసు క్లోజ్.. ఇలా!
- February 27, 2018
నాలుగు రోజులుగా సంచలనం సృష్టించిన మహానటి శ్రీదేవి మృతి కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. బాత్టబ్లో మునగడం వల్లే శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిందని... దుబయి పోలీసులు నిర్ధరించారు. అటు ఈ వ్యవహారంలో మొదట్నుంచి కఠినంగా వ్యవహరించిన ప్రాసిక్యూషన్ సైతం... ఈ వ్యవహారంలో ఎలాంటి ఇతర అనుమానాలు లేవని తేల్చేసింది. ఈ కేసులో ఉన్న సందేహాలన్నీ నివృత్తి చేసుకున్నామని... స్థానిక చట్టాల ప్రకారమే ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపామని వెల్లడించింది. ఇకపై ఈ కేసులో ఎలాంటి విచారణ ఉండదని... కేసును క్లోజ్ చేస్తున్నామని దుబాయ్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. పూర్తిస్థాయి విచారణ తర్వాతే... మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.
శనివారం రాత్రి 10 గంటల సమయంలో దుబాయ్లోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ గదిలో శ్రీదేవి కన్నుమూసింది. హార్ట్ స్ట్రోక్ వల్లే శ్రీదేవి చనిపోయిందని మొదట అంతా అనుకున్నారు. అయితే ఫోరెన్సిక్ విచారణ ప్రారంభమైన తర్వాత.... సీన్ క్రమంగా మారిపోయింది. ఆమెకు అసలు హార్ట్ స్ట్రోక్ రానే లేదని... పోస్టు మార్టం నివేదికలో స్పష్టమైంది. ఎక్కువగా ఆల్కహాల్ సేవించిన శ్రీదేవి బాత్టబ్లో మునగడం వల్ల చనిపోయిందని తేల్చారు. అయితే ఎలాంటి అనారోగ్యం లేని శ్రీదేవి... బాత్టబ్లో ఎలా పడిందనే దానిపై సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై ప్రాసిక్యూషన్ దృష్టిసారించింది. స్థానిక చట్టాల ప్రకారం విచారణ అంతా పూర్తయితే గానీ... క్లియరెన్స్ సర్టిఫెకెట్ ఇచ్చేది లేదని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో మృతదేహం అప్పగింత తరలింపు ఆలస్యమైంది.
నిన్నటి నుంచి ఈ వ్యహారంపై కూలకషంగా విచారణ జరిపిన ప్రాసిక్యూషన్ అధికారులు... ఎట్టకేలకు ఇందులో ఎలాంటి కుట్ర లేదని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక చట్టాల ప్రకారం అన్ని కోణాల్లో విచారణ జరిపాకే... క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు అధికారులు.. తెలిపారు. అటు క్లియరెన్స్ సర్టిఫికెట్, మృతదేహం అప్పగింత వ్యవహారాన్ని భారత దౌత్య కార్యాలయం కూడా ధృవీకరించింది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







