కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం
- February 27, 2018
చెన్నై: కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూశారు.అనారోగ్యంతో కాంచీపురం ఏబీసీడి ఆసుపత్రిలో మంగళవారం నాడు చేరారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి బుధవారం ఉదయం పూట మరణించారు. శ్వాసకోశ వ్యాధితో ఇబ్బందిపడుతున్నారు. పలు మార్లు ఆయన అస్వస్థతకు గురౌతున్నాడు.
కంచి పీఠానికి 1994 జనవరి 3 నుండి జయేంద్ర సరస్వతి పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. సుదీర్ఘంగా ఆయన పీఠాధిపతిగా కొనసాగుతున్నాడు. జయేంద్ర సరస్వతి వయస్సు 82 ఏళ్ళు.
1935 జూలై 18వ తేదిన తంజావూరు జిల్లాలో కంచి జయేంద్ర సరస్వతి జన్మించారు. అనారోగ్యం కారణంగానే శిష్య బృందానికి పీఠాన్ని అప్పగించాలని భావించారని చెబుతున్నారు.
జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రమణ్య అయ్యర్. 1954 మార్చి 24న, జయేంద్ర సరస్వతిగా మారారు. కంచి పీఠానికి 69వ, పీఠాధిపతిగా జయేంద్ర సరస్వతి కొనసాగుతున్నారు.
శంకర్ రామన్ హత్య కేసులో జయేంద్ర సరస్వతి జైలుకు వెళ్ళాడు. అయితే ఆ కేసులో జయేంద్ర సరస్వతి నిర్ధోషిగా విడుదలయ్యారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జయేంద్ర సరస్వతి శంకర్రామన్ హత్య కేసులో అరెస్టయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..







