త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆర్మీ అధికారిగా ఎన్టీఆర్..
- February 27, 2018
జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే చిత్రానికి కేవలం పూజా కార్యక్రమాలు మాత్రమే జరిగాయి. ఆ సమయంలో త్రివిక్రమ్ అజ్ఞాతవాసి బిజీలో ఉన్నారు.
ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాపైనే దృష్టిపెట్టారు త్రివిక్రమ్. అజ్ఞాతవాసి పరాజయం తర్వాత ఈ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి. అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సినిమా ఉంటుందా లేదా అనే సందిగ్దత నెలకొంది. అయితే కేవలం ఒక ఫ్లాప్తో దర్శకుడి ప్రతిభను తక్కువ చేయలేరు. సినీరంగంలో జయాపజయాలు అతి సహజం. ఈ విషయం ఎన్టీఆర్కు తెలియంది కాదు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మార్చి మూడవ వారంలో మొదలవుతుందని తెలిసింది. ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారని అంటు న్నారు. సినిమాకు నేపథ్యం కూ డా ఆర్మీ కావడం విశేషం. ఆర్మీ పాత్ర కోసం ఎన్టీఆర్ ఇప్పటికే కొంత పరిశీలన చేసి జాగ్రత్తలు తీసుకున్నారని, కొత్త లుక్తో కనిపిస్తారని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం వివరాలు వెల్లడి కాలేదు. హీ రోయిన్గా పూజా హెగ్డే నటిస్తుందని తెలిసింది.
హారిక హాసిని పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ స్వరరచన చేస్తున్నారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







