హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్
- February 27, 2018
ఢిల్లీ : హజ్ యాత్రికులకు శుభవార్త. హజ్ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు కేంద్రం చార్జీలను తగ్గించిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. దీన్ని కీలక చర్యగా ఆయన అభివర్ణించారు. మైనార్టీల సాధికారత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, వారి బుజ్జగింపు కోసం కాదని అన్నారు. గత యుపిఎ ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రికులను రాజకీయంగా, ఆర్థికంగా దోచుకున్నారని, తాజా నిర్ణయంతో ఆ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని నఖ్వీ పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా, సౌదీ ఎయిర్లైన్స్ అండ్ ఫ్లైనాస్, సౌదీ అరేబియాకు చెందిన ఒక విమానంలో ప్రయాణించే యాత్రికులకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. అహ్మదాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళితే రూ.65,015 వసూలు చేస్తారు. ఇదే మార్గంలో 2013-14లో ఈ చార్జీ రూ.98,750గా ఉంది. ప్రస్తుతం ముంబై నుంచి హజ్కు ఉన్న రూ.98,750 చార్జీని రూ.57,857కు తగ్గించారు. హజ్ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో జనవరిలో రద్దుచేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







