హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్
- February 27, 2018
ఢిల్లీ : హజ్ యాత్రికులకు శుభవార్త. హజ్ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు కేంద్రం చార్జీలను తగ్గించిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. దీన్ని కీలక చర్యగా ఆయన అభివర్ణించారు. మైనార్టీల సాధికారత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, వారి బుజ్జగింపు కోసం కాదని అన్నారు. గత యుపిఎ ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రికులను రాజకీయంగా, ఆర్థికంగా దోచుకున్నారని, తాజా నిర్ణయంతో ఆ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని నఖ్వీ పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా, సౌదీ ఎయిర్లైన్స్ అండ్ ఫ్లైనాస్, సౌదీ అరేబియాకు చెందిన ఒక విమానంలో ప్రయాణించే యాత్రికులకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. అహ్మదాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళితే రూ.65,015 వసూలు చేస్తారు. ఇదే మార్గంలో 2013-14లో ఈ చార్జీ రూ.98,750గా ఉంది. ప్రస్తుతం ముంబై నుంచి హజ్కు ఉన్న రూ.98,750 చార్జీని రూ.57,857కు తగ్గించారు. హజ్ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో జనవరిలో రద్దుచేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









