కువైట్ - కోచి సర్వీసును ప్రారంభించనున్న ఎయిర్ ఇండియా
- February 28, 2018
కువైట్: మార్చి 25 నుంచి కువైట్ నుంచి కోచి వరకు కొత్త శీతాకాల షెడ్యూల్ ను ప్రారంభించనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. ఈ కొత్త మార్గం కువైట్ నుంచి కొచ్చికి వయా ధమ్మం వారానికి మూడుసార్లు ఉంటుంది. ఈ కువైట్ - కోచి సర్వీసు బుధవారం, శుక్రవారం, ఆదివారాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఫ్లైట్ ఐఎక్స్ - 495 విమానం ఉదయం 8.15 గంటలకు కోచిలో బయలుదేరి , అదేరోజు ఉదయం కువైట్ లో 10.55 గంటలకు చేరుకొంటుంది. అలాగే కువైట్ లో కోచికి బయలుదేరే విమానం ఉదయం 11.55 గంటలకు కువైట్ లో బయలుదేరి వయా ధమ్మం మీదుగా కోచికి 9.05 గంటలకు చేరుకొంటుంది.. ఈ కొత్త మార్గం ఇప్పటికే ఉన్న కువైట్ - కోజికోడ్- కొచ్చి మార్గంలో అదనంగా ఉంది. అల్ ఇండియా ఎక్స్ ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె . శ్యామ్ సుందర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది లాభాన్ని సంపాదించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ భరోసానిచ్చింది. బడ్జెట్ లాభం రూ .208 కోట్లు, కాని అసలు లాభం రూ. 250 కోట్లు రావచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం రూ. 297 కోట్ల కంటే తక్కువగా ఆదాయం ఉంది. ఎందుకంటే ఇంధన ధరలలో 7 నుంచి 10 శాతం పెంపు, ముఖ్యంగా ఎకానమీ క్లాసులో ఆ విధంగా జరిగింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు 90 శాతం గల్ఫ్ దేశాల్లోనే ఉన్నాయి.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..