మరికాసేపట్లో జయేంద్ర సరస్వతి మహాసమాధి
- February 28, 2018
చెన్నై: కంచి కామాకోఠి పిఠాధిపతి జయేంద్ర సరస్వతి నిన్న శివైక్యం చెందిన విషయం తెలిసిందే. కాసేపట్లో ఆయన మహాసమాధి కానున్నారు. కంచిమఠంలోని చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే జయేంద్ర సరస్వతి మహాసమాధికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆయన పార్థీవ దేహాన్ని నిన్నటి నుంచి లక్షకు పైగా భక్తులు సందర్శించారు. సనాతన ధర్మం పరిరక్షించే క్రమంలో జయేంద్ర సరస్వతి వారిది ఓ స్వర్ణయుగంగా పేర్కొంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అడుగుజాడల్లో నడిచేందుకు సన్యాస ఆశ్రమం స్వీకరించారు. చంద్రశేఖర స్వామితో పాటు మూడు సార్లు దేశమంతటా పాదయాత్ర చేశారు. కంచి పీఠం జయేంద్ర సరస్వతి నేతృత్వంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. దేశంలో ఆలయాలతో పాటు విద్యాలయాలు, వైద్యాలయాలు అవసరమని భావించి వాటి స్థాపనకు విశేష కృషి చేశారు. అదేవిధంగా వయోవృధ్దుల కోసం వృద్ధాలయాలు, గోవుల రక్షణకు గోశాలలను ఏర్పాటు చేశారు. జయేంద్ర సరస్వతి అభినవ శంకరులుగా పేరు గడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







