మరికాసేపట్లో జయేంద్ర సరస్వతి మహాసమాధి
- February 28, 2018
చెన్నై: కంచి కామాకోఠి పిఠాధిపతి జయేంద్ర సరస్వతి నిన్న శివైక్యం చెందిన విషయం తెలిసిందే. కాసేపట్లో ఆయన మహాసమాధి కానున్నారు. కంచిమఠంలోని చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే జయేంద్ర సరస్వతి మహాసమాధికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆయన పార్థీవ దేహాన్ని నిన్నటి నుంచి లక్షకు పైగా భక్తులు సందర్శించారు. సనాతన ధర్మం పరిరక్షించే క్రమంలో జయేంద్ర సరస్వతి వారిది ఓ స్వర్ణయుగంగా పేర్కొంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అడుగుజాడల్లో నడిచేందుకు సన్యాస ఆశ్రమం స్వీకరించారు. చంద్రశేఖర స్వామితో పాటు మూడు సార్లు దేశమంతటా పాదయాత్ర చేశారు. కంచి పీఠం జయేంద్ర సరస్వతి నేతృత్వంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. దేశంలో ఆలయాలతో పాటు విద్యాలయాలు, వైద్యాలయాలు అవసరమని భావించి వాటి స్థాపనకు విశేష కృషి చేశారు. అదేవిధంగా వయోవృధ్దుల కోసం వృద్ధాలయాలు, గోవుల రక్షణకు గోశాలలను ఏర్పాటు చేశారు. జయేంద్ర సరస్వతి అభినవ శంకరులుగా పేరు గడించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







