'సుమం ప్రతి సుమం' పాట రచయిత.. కన్నుమూత

- March 01, 2018 , by Maagulf
'సుమం ప్రతి సుమం' పాట రచయిత.. కన్నుమూత

ప్రముఖ నవలా రచయిత నాయని కృష్ణమూర్తి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగుళూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాయని 23 ఏళ్ల వయసులో 'యామినీకుంతలాలు' పేరుతో మొదటి నవల రాశారు. పిల్లల సాహిత్యంలో కూడా ప్రవేశం ఉన్న నాయని వారి కోసం మాబడి, పాఠశాల పుస్తకాలను రాశారు. నవలలతో పాటు, పలు ఆధ్యాత్మిక గ్రంధాలు కూడా రచించారు. సినీ గేయరచయితగా కూడా పలు సినిమాలు పని చేశారు. మహర్షి సినిమాలోని 'సుమం ప్రతి సుమం' పాట నాయని రాసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com