ఈజిప్ట్‌ రైలు ప్రమాదం: 15కు చేరిన మృతుల సంఖ్య

- March 01, 2018 , by Maagulf
ఈజిప్ట్‌ రైలు ప్రమాదం: 15కు చేరిన మృతుల సంఖ్య

కెయిరో: ఈజిప్ట్‌లోని బెహరియా ప్రావిన్స్‌లో బుధవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు పెరిగిందని అధికార మెనా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ రైలు ప్రమాదంలో 15 మంది మరణించగా 40మందికి పైగా గాయపడ్డారని రవాణా మంత్రిత్వశాఖ ప్రతినిధి మహ్మద్‌ ఎజ్‌ను ఉటంకిస్తూ మెనా వార్తా సంస్థ వెల్లడించింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రవాణా మంత్రి హేషమ్‌ అరాఫత్‌ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలపై సమీక్షించారని ఈజిప్ట్‌ టీవీ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com