రామోజీ ఫిల్మ్సిటీలో 'సాక్ష్యం' సినిమా షూటింగ్
- March 01, 2018
బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సాక్ష్యం'. పూజా హెగ్డే కథానాయిక. శ్రీవాస్ దర్శకుడు. అభిషేక్ నామా నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో అమెరికాలో మరో షెడ్యూల్ జరగబోతోంది. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. మే 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే డిజిటల్ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి రూ.13.5 కోట్లు పలికాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రీవాస్ కథని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. పీటర్ హెయిన్స్ నేతృత్వంలోని యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయన్నారు. సంగీతం: హర్షవర్థన్
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







