రామోజీ ఫిల్మ్సిటీలో 'సాక్ష్యం' సినిమా షూటింగ్
- March 01, 2018
బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సాక్ష్యం'. పూజా హెగ్డే కథానాయిక. శ్రీవాస్ దర్శకుడు. అభిషేక్ నామా నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో అమెరికాలో మరో షెడ్యూల్ జరగబోతోంది. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. మే 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే డిజిటల్ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి రూ.13.5 కోట్లు పలికాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రీవాస్ కథని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. పీటర్ హెయిన్స్ నేతృత్వంలోని యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయన్నారు. సంగీతం: హర్షవర్థన్
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









