దుబాయ్ లో ఒక్క షెడ్యూల్కే రూ. 40 కోట్లు..!
- March 03, 2018
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్, ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్పై బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం దుబాయ్లో మరో షెడ్యూల్కు రెడీ అవుతోంది.
ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు కొన్ని చేజ్ సీన్లు, యాక్షన్ సీన్లు చిత్రీకరించనున్నారట. అందుకు తగ్గట్టుగా ఈ ఒక్క షెడ్యూల్కు భారీ బడ్జెట్ను కేటాయించారు చిత్రయూనిట్. కేవలం దుబాయ్లో జరిగే షూటింగ్ కోసమే 40 కోట్ల రూపాయలు కేటాయించారట. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







