వియత్నాం అధ్యక్షునికి స్వాగతం పలికిన మోడీ

- March 03, 2018 , by Maagulf
వియత్నాం అధ్యక్షునికి స్వాగతం పలికిన మోడీ

న్యూఢిల్లీ : ద్వైపాక్షిక చర్చల కోసం భారత్‌లో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు త్రాన్‌ డై క్వాంగ్‌ను ఇక్కడి హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోడీ స్వాగతం పలికారు. ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మొదటిగా వియత్నాం అధ్యక్షుడు రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో సంప్రదాయకంగా ఆతిథ్యాన్ని స్వీకరించారు. మూడు రోజుల భారత్‌ పర్యటన సందర్భంగా వియత్నాం అధ్యక్షుడు శుక్రవారం సాయంత్రం ఇక్కడకు చేరుకున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com