నేడు హైదరాబాద్లో అతిలోక సుందరికి సంతాప సభ
- March 03, 2018హైదరాబాద్: అతిలోకసుందరి, లెజండరీ నటి, ఇండియన్ స్టార్ శ్రీదేవి.. కోట్లాది మంది అభిమానులను, వేలాదిమంది నటీనటులను విషాదంలోకి నెట్టేసి తిరిగిరాని లోకాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె చనిపోలేదని ఇదంతా కలయేనని కొందరు వీరాభిమానులు, ఆరాధ్యులు భ్రమలో ఉన్నారంటే శ్రీదేవి రేంజ్ ఏంటో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. కాగా ఆమె అంత్యక్రియలు టాలీవుడ్ ప్రముఖులు తరలివెళ్లిన విషయం విదితమే.
అయితే శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి టాలీవుడ్ ఓ వేదికను ఏర్పాటుచేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో ఆదివారం ఎంపీ టీ సుబ్బరామి రెడ్డి ఆధ్వర్యంలో టాలీవుడ్ ప్రముఖులు సంతాప సభ నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు సంతాప సభ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, జయసుధ, నివేదా థామస్ తో పాటు పలువురు హాజరుకానున్నట్లు సమాచారం. అంతేకాకుండా సినీ దర్శకులు రాఘవేంద్రరావు, రాంగోపాల్ వర్మతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలిసింది. కాగా ఈ సందర్భంగా ఆర్జీవీ సభలో ప్రసగించనున్నారని.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఆమెతో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ వరుస ట్వీట్లు, శ్రీదేవి అభిమానులకు లేఖ ఇలా ఆర్జీవీలోని బాధనంతా బయటపెట్టినప్పటికీ పాపం.. ఇంకా విషాదంలో నుంచి కోలుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్