'తెలంగాణ ప్రజల పార్టీ' ఆవిర్భావం
- March 04, 2018
తెలంగాణలో మరో కొత్త పార్టీ. ఇటీవలే ఈ కొత్త పార్టీని ఏర్పాటును జెఏసి ఛైర్మన్ కోదండరాం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీ పెట్టాలని వస్తున్న డిమాండ్ను సమ్మతిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండరాం వెల్లడించారు. కాగా ఇప్పుడు మరో కొత్త పార్టీ ప్రకటన వచ్చింది.
జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో 'తెలంగాణ ప్రజల పార్టీ' పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కొత్త పార్టీని ప్రకటించడంతో పాటు జెండా ఆవిష్కరించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అందరికీ సమానావకాశాలు కల్పించడం కోసం, కులవివక్ష నిర్మూలన, నిరుపేదలందరికీ ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం తమ పార్టీ ఆశయాలని చంద్రకుమార్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









