'తెలంగాణ ప్రజల పార్టీ' ఆవిర్భావం
- March 04, 2018
తెలంగాణలో మరో కొత్త పార్టీ. ఇటీవలే ఈ కొత్త పార్టీని ఏర్పాటును జెఏసి ఛైర్మన్ కోదండరాం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీ పెట్టాలని వస్తున్న డిమాండ్ను సమ్మతిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండరాం వెల్లడించారు. కాగా ఇప్పుడు మరో కొత్త పార్టీ ప్రకటన వచ్చింది.
జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో 'తెలంగాణ ప్రజల పార్టీ' పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కొత్త పార్టీని ప్రకటించడంతో పాటు జెండా ఆవిష్కరించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అందరికీ సమానావకాశాలు కల్పించడం కోసం, కులవివక్ష నిర్మూలన, నిరుపేదలందరికీ ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం తమ పార్టీ ఆశయాలని చంద్రకుమార్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ







