చెట్టుకింద మాదకద్రవ్యాలను దాచిపెట్టిన అక్రమ రవాణాదారులు
- March 04, 2018
దుబాయ్: చిటారు కొమ్మన మిఠాయి పొట్లం మాదిరిగా ..కొందరు నిందితులు మాదక ద్రవ్యాలను ఓ చెట్టు కింద ఎవరకి తెలియకుండా దాచిపెట్టారు. అయితే, వాటిని పాతాళంలో దాచిపెట్టినా గల్ఫ్ పోలీసులు వెలికి తీస్తారు. నిందితులను న్యాయస్థానంలో నుంచోబెడతారు. ఆ తర్వాత కఠినమైన శిక్షలు అమలుచేస్తారు. శనివారం మాదకద్రవ్య నిరోధక శాఖ విభాగ అధికారులు ఆసియా దేశాలకు చెందిన నలుగురు మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను పట్టుకున్నారు. దుబాయ్లోని ఓ ప్రాంతంలో భారీగా దాచిపెట్టిన డ్రగ్స్ను కనుగొన్నారు. 91.7 కేజీల కాప్టాగోన్ అనే మాధకద్రవ్యాల మాత్రల రూపంలో సర్దుకొని ఆ సంచులను ఓ చెట్టుకింద రహస్యంగా భద్రపరిచారు. వీరి అక్రమ చర్యలను రహస్యంగా గమనించిన నిఘా అధికారులు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరించి ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకొన్నారు.. చెట్టుకింద దాచిన డ్రగ్స్ను బయటకు తీస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహిం అల్ మన్సూరి వెల్లడించారు. ఈ కేసుపై న్యాయస్థానం విచారణ జరపనుందని, నలుగురు నిందితులు జైలుశిక్ష తప్పదని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







