చెట్టుకింద మాదకద్రవ్యాలను దాచిపెట్టిన అక్రమ రవాణాదారులు
- March 04, 2018
దుబాయ్: చిటారు కొమ్మన మిఠాయి పొట్లం మాదిరిగా ..కొందరు నిందితులు మాదక ద్రవ్యాలను ఓ చెట్టు కింద ఎవరకి తెలియకుండా దాచిపెట్టారు. అయితే, వాటిని పాతాళంలో దాచిపెట్టినా గల్ఫ్ పోలీసులు వెలికి తీస్తారు. నిందితులను న్యాయస్థానంలో నుంచోబెడతారు. ఆ తర్వాత కఠినమైన శిక్షలు అమలుచేస్తారు. శనివారం మాదకద్రవ్య నిరోధక శాఖ విభాగ అధికారులు ఆసియా దేశాలకు చెందిన నలుగురు మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను పట్టుకున్నారు. దుబాయ్లోని ఓ ప్రాంతంలో భారీగా దాచిపెట్టిన డ్రగ్స్ను కనుగొన్నారు. 91.7 కేజీల కాప్టాగోన్ అనే మాధకద్రవ్యాల మాత్రల రూపంలో సర్దుకొని ఆ సంచులను ఓ చెట్టుకింద రహస్యంగా భద్రపరిచారు. వీరి అక్రమ చర్యలను రహస్యంగా గమనించిన నిఘా అధికారులు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరించి ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకొన్నారు.. చెట్టుకింద దాచిన డ్రగ్స్ను బయటకు తీస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహిం అల్ మన్సూరి వెల్లడించారు. ఈ కేసుపై న్యాయస్థానం విచారణ జరపనుందని, నలుగురు నిందితులు జైలుశిక్ష తప్పదని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









