చెట్టుకింద మాదకద్రవ్యాలను దాచిపెట్టిన అక్రమ రవాణాదారులు
- March 04, 2018
దుబాయ్: చిటారు కొమ్మన మిఠాయి పొట్లం మాదిరిగా ..కొందరు నిందితులు మాదక ద్రవ్యాలను ఓ చెట్టు కింద ఎవరకి తెలియకుండా దాచిపెట్టారు. అయితే, వాటిని పాతాళంలో దాచిపెట్టినా గల్ఫ్ పోలీసులు వెలికి తీస్తారు. నిందితులను న్యాయస్థానంలో నుంచోబెడతారు. ఆ తర్వాత కఠినమైన శిక్షలు అమలుచేస్తారు. శనివారం మాదకద్రవ్య నిరోధక శాఖ విభాగ అధికారులు ఆసియా దేశాలకు చెందిన నలుగురు మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను పట్టుకున్నారు. దుబాయ్లోని ఓ ప్రాంతంలో భారీగా దాచిపెట్టిన డ్రగ్స్ను కనుగొన్నారు. 91.7 కేజీల కాప్టాగోన్ అనే మాధకద్రవ్యాల మాత్రల రూపంలో సర్దుకొని ఆ సంచులను ఓ చెట్టుకింద రహస్యంగా భద్రపరిచారు. వీరి అక్రమ చర్యలను రహస్యంగా గమనించిన నిఘా అధికారులు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరించి ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకొన్నారు.. చెట్టుకింద దాచిన డ్రగ్స్ను బయటకు తీస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహిం అల్ మన్సూరి వెల్లడించారు. ఈ కేసుపై న్యాయస్థానం విచారణ జరపనుందని, నలుగురు నిందితులు జైలుశిక్ష తప్పదని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









