'అన్నదాతా సుఖీభవ'
- March 04, 2018
సామాజిక.. ఇతివృత్తాలతో చిత్రాలను తెరకెక్కించే ఆర్.నారాయణమూర్తి ఈసారి గిట్టుబాటు ధర దొరకని కారణంగా ఆత్మహత్యలకి పాల్పడుతోన్న రైతుల వ్యథతో 'అన్నదాతా సుఖీభవ' చిత్రాన్ని తనే నటిస్తూ స్వీయదర్శకత్వంలో నిర్మించారు. ఇది స్నేహచిత్ర పతాకంపై ఆయన తెరకెక్కిస్తున్న 30వ చిత్రం. విడుదలకి సిద్ధమైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో ఆర్.నారాయణమూర్తి విలేకర్లతో మాట్లాడారు. ''రైతే రాజు అన్నది ఒకప్పటి మాట. ఇప్పటిది కాదు. ఈనాడు పరిస్థితిని చూస్తుంటే రైతు బికారి అనిపిస్తోంది. వాస్తవానికి పొద్దు తనని తాకకముందే శిలువలా నాగల్ని మోసుకువెళ్లే కరుణామయుడు..రైతు. ఇదే మా సినిమా నినాదం. అసలు రైతే అన్నదాత. కానీ ఆ అన్నదాత సుఖంగా లేడు. ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 1995 నుంచి ఇప్పటిదాకా మూడున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పదేళ్ల కిందట డా।। స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారంగా ఏ ప్రభుత్వాలూ రైతులకి గిట్టుబాటు ధరల్ని అందించేలా కృషి చేయలేదు. నిరాటంకంగా రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి ఈవేళ రైతు సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందినవాడు. ఈనాడున్న పరిస్థితుల రీత్యా కొందరు వ్యవసాయం దండగ అనుకుంటున్నారు. ఈ మాటలో నిజం లేదు. వ్యవసాయం దండగ కాదు పండగ అని మా చిత్రం ద్వారా రుజువు చేసే ప్రయత్నంలో భాగమే ఈ సినిమా. ఇందులో ఎనిమిది పాటలున్నాయి. ప్రజాకవులు రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అమోఘం. గద్దర్, వందేమాతరం శ్రీనివాస్తోపాటు యువగాయకుడు పవన్ చరణ్ పాడిన రెండు పాటలు ఆకట్టుకుంటాయి. మరో మూడు రోజుల్లో సెన్సారును పూర్తిచేసుకుని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం''అన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







