దుబాయ్లో మూడేళ్ళపాటు ఫీజులు పెరగవ్: షేక్ హమదాన్
- March 05, 2018
దుబాయ్ ప్రభుత్వం, రానున్న మూడేళ్ళలో పబ్లిక్ సర్వీసెస్కి సంబంధించిన ఫీజుల్ని పెంచబోదని షేక్ హమదాన్ ప్రకటించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ ఈ మేరకు ఓ ఆర్డర్ని పాస్ చేయగా, అది ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ డైరెక్షన్స్ నేపథ్యంలో ఈ ఆర్డర్ని విడుదల చేశారు. పౌరుల సోషల్ స్టెబిలిటీకి మద్దతుగా ఈ చర్య తీసుకున్నట్లు షేక్ హమదాన్ వివరించారు. దుబాయ్ ఎకనమిక్ కాంపిటీటివ్నెస్ని కూడా ఈ నిర్ణయం పెంచుతుందని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 28న యూఏఈ క్యాబినెట్ సమావేశం జరగ్గా, ఈ సమావేశంలో 'మూడేళ్ళ పాటు ఫీజులు పెంచకూడదు' అనే నిర్ణయం తీసుకున్నట్లు షేక్ మొహమ్మద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పౌరులు, రెసిడెంట్స్ యొక్క ఎకనమిక్ స్టెబలిటీనే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారాయన.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







