దుబాయ్లో మూడేళ్ళపాటు ఫీజులు పెరగవ్: షేక్ హమదాన్
- March 05, 2018
దుబాయ్ ప్రభుత్వం, రానున్న మూడేళ్ళలో పబ్లిక్ సర్వీసెస్కి సంబంధించిన ఫీజుల్ని పెంచబోదని షేక్ హమదాన్ ప్రకటించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ ఈ మేరకు ఓ ఆర్డర్ని పాస్ చేయగా, అది ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ డైరెక్షన్స్ నేపథ్యంలో ఈ ఆర్డర్ని విడుదల చేశారు. పౌరుల సోషల్ స్టెబిలిటీకి మద్దతుగా ఈ చర్య తీసుకున్నట్లు షేక్ హమదాన్ వివరించారు. దుబాయ్ ఎకనమిక్ కాంపిటీటివ్నెస్ని కూడా ఈ నిర్ణయం పెంచుతుందని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 28న యూఏఈ క్యాబినెట్ సమావేశం జరగ్గా, ఈ సమావేశంలో 'మూడేళ్ళ పాటు ఫీజులు పెంచకూడదు' అనే నిర్ణయం తీసుకున్నట్లు షేక్ మొహమ్మద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పౌరులు, రెసిడెంట్స్ యొక్క ఎకనమిక్ స్టెబలిటీనే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారాయన.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









