దుబాయ్లో మూడేళ్ళపాటు ఫీజులు పెరగవ్: షేక్ హమదాన్
- March 05, 2018
దుబాయ్ ప్రభుత్వం, రానున్న మూడేళ్ళలో పబ్లిక్ సర్వీసెస్కి సంబంధించిన ఫీజుల్ని పెంచబోదని షేక్ హమదాన్ ప్రకటించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ ఈ మేరకు ఓ ఆర్డర్ని పాస్ చేయగా, అది ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ డైరెక్షన్స్ నేపథ్యంలో ఈ ఆర్డర్ని విడుదల చేశారు. పౌరుల సోషల్ స్టెబిలిటీకి మద్దతుగా ఈ చర్య తీసుకున్నట్లు షేక్ హమదాన్ వివరించారు. దుబాయ్ ఎకనమిక్ కాంపిటీటివ్నెస్ని కూడా ఈ నిర్ణయం పెంచుతుందని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 28న యూఏఈ క్యాబినెట్ సమావేశం జరగ్గా, ఈ సమావేశంలో 'మూడేళ్ళ పాటు ఫీజులు పెంచకూడదు' అనే నిర్ణయం తీసుకున్నట్లు షేక్ మొహమ్మద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పౌరులు, రెసిడెంట్స్ యొక్క ఎకనమిక్ స్టెబలిటీనే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారాయన.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







