రస్ అల్ ఖైమాలో వన్ స్టాప్ ట్రక్ ఇన్స్పెక్షన్'
- March 05, 2018
రస్ అల్ ఖైమా పోలీసులు కొత్తగా ఇన్స్పెక్షన్ స్టేషన్ని హెవీ ట్రక్స్ కోసం సయీదీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రొసిడ్యూర్స్ని యూనిఫై చేయడం, సమయాన్ని తగ్గించడం ఈ స్టేషన్ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. టైపింగ్, పొటో కాపీయింగ్ సర్వీసులు, పీ పేమెంట్, ఇతర టెక్నికల్ ఇన్స్పెక్షన్స్, చెకప్స్ ఈ స్టేషన్లో అందుబాటులో ఉంటాయని రస్ అల్ ఖైమా జనరల్ రిసోర్సెస్ ఛైర్మన్ బ్రిగేడియర్ జమాల్ అహ్మద్ తెలిపారు. లైసెన్సింగ్ సర్వీసుల కోసం అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. తమ అవసరాల కోసం పలు చోట్ల తిరగాల్సిన పనిలేకుండా, ఇక్కడే అన్ని సేవలూ పొందవచ్చు. జోర్డాన్కి చెందిన అష్రాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ, గతంలో తాను రిజిస్ట్రేషన్ కోసం మూడు గంటల సమయం వేచి చూడాల్సి వచ్చేదనీ, ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే తన పని అయిపోతోందని చెప్పారు. ట్రక్ డ్రైవర్లకు ఈ స్టేషన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఈజిప్ట్కి చెందిన మొహమ్మద్ ఇబ్రహీమ్ అన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









