ఆస్కార్ ట్రోపీని దొంగలించాడు..
- March 06, 2018
ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న మెక్ డోర్మాండ్ కు చేదు అనుభవం ఎదురయింది. ఆమె గెలుచుకున్న ఆస్కార్ అవార్డు ట్రోపీని ఓ దొంగ ఎత్తుకుపోయాడు. రంగంలో దిగిన పోలీసులు దొంగను పట్టుకున్నారు. మెక్ డోర్మాండ్కు ఆమె పోగొట్టుకున్న ట్రోపీని తిరిగి అందించారు. కొన్ని గంటల పాటు నెలకొన్న టెన్షన్ వాతావరణం తొలగించారు. అవార్డును తిరిగి పొందిన డోర్మాండ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆస్కార్ వేడుకలు తర్వాత జరిగిన పార్టీలో 47 ఏళ్ల టెర్రీ బ్రియాంట్ అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ఆధారంగా ఈ దొంగను పోలీసులు పట్టుకున్నారు. టెర్రీ బ్రియాంట్కే ఆస్కార్ లభించిందని భావించిన ఫోటోగ్రాఫర్ ..అతని వెనకాలే వెళుతూ ఫోటోలు తీస్తున్నాడు. దీంతో ఏం చేయాలో తోచని బ్రియాంట్ ఫోటోగ్రాఫర్ చేతిలో తాను దొంగలించిన ట్రోపీని పెట్టాడు. అక్కడ నుంచి జారుకోడానికి ప్రయత్నించాడు. ఈలోగా అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయం బయట పడిన కాసేపటికే బ్రియాంట్ కి చెందిన ఓ వీడియో ఫేస్బుక్ పేజీలో దర్శనమిచ్చింది. బ్రియాంట్ ఆస్కార్ ట్రోపీని ముద్దాడుతూ అక్కడ ఉన్న వారితో ముచ్చటిస్తున్నాడు. ఇంతలోనే అక్కడివారు అతడితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఆస్కార్ అవార్డు తనకే వచ్చిందా అని భ్రమ కలిగించే విధంగా బ్రియాంట్ ప్రవర్తించాడు. దీంతో అందరూ అతడి ప్రవర్తన నిజమే అనుకున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









