లసా వైరస్.. భయపెడుతున్న మరో ప్రాణాంతక వ్యాధి
- March 06, 2018
అనేక రకాల వ్యాధులకు మందిచ్చే వైద్యుడు సైతం ఈ వ్యాది బారిన పడుతున్నాడు. నైజీరియాలో మొదలైన ఈ ప్రాణాంతక వ్యాధి ప్రపంచమంతా విస్తరిస్తోంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గణాంకాల ప్రకారం జనవరి నుంచి ఇప్పటి వరకు నైజీరియాలో 1000 లసా కేసులు నమోదయ్యాయి. గర్భిణులకు ఈ వ్యాధి సోకితే కడుపులోని బిడ్డ చనిపోవడం జరుగుతోంది. ఈ వ్యాధికి ఇంత వరకు వ్యాక్సిన్ కనిపెట్టలేక పోతున్నారు వైద్యులు. శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం చూపిస్తున్న ఈ వ్యాధి శరీరంలోని రక్తనాళాలను ధ్వంసం చేస్తోంది.
జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కూడా మలేరియా, డెంగ్యూ వ్యాధి లక్షణాల మాదిరిగానే ఉంటుంది. ఈ వ్యాధిని నిర్థారించే ల్యాబ్లు చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 90మంది మృత్యువాత పడ్డారు. నైజీరియా తరువాత ఈ వ్యాధి పశ్చిమాఫ్రికా దేశాలకు కూడా విస్తరిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ఇది విస్తరిస్తోందని తెలిసినా వ్యాధి ప్రభలడానికి గల మూలకారణాలను గుర్తించలేకపోతున్నారు. ఎలుకలు, ఇతర క్షీరదాల వల్ల ఇది మనుషులకు ఎక్కువగా సోకుతుంది. వైద్యం చేసే నర్సులు, డాక్టర్లు కూడా ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









