లసా వైరస్.. భయపెడుతున్న మరో ప్రాణాంతక వ్యాధి
- March 06, 2018
అనేక రకాల వ్యాధులకు మందిచ్చే వైద్యుడు సైతం ఈ వ్యాది బారిన పడుతున్నాడు. నైజీరియాలో మొదలైన ఈ ప్రాణాంతక వ్యాధి ప్రపంచమంతా విస్తరిస్తోంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గణాంకాల ప్రకారం జనవరి నుంచి ఇప్పటి వరకు నైజీరియాలో 1000 లసా కేసులు నమోదయ్యాయి. గర్భిణులకు ఈ వ్యాధి సోకితే కడుపులోని బిడ్డ చనిపోవడం జరుగుతోంది. ఈ వ్యాధికి ఇంత వరకు వ్యాక్సిన్ కనిపెట్టలేక పోతున్నారు వైద్యులు. శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం చూపిస్తున్న ఈ వ్యాధి శరీరంలోని రక్తనాళాలను ధ్వంసం చేస్తోంది.
జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కూడా మలేరియా, డెంగ్యూ వ్యాధి లక్షణాల మాదిరిగానే ఉంటుంది. ఈ వ్యాధిని నిర్థారించే ల్యాబ్లు చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 90మంది మృత్యువాత పడ్డారు. నైజీరియా తరువాత ఈ వ్యాధి పశ్చిమాఫ్రికా దేశాలకు కూడా విస్తరిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ఇది విస్తరిస్తోందని తెలిసినా వ్యాధి ప్రభలడానికి గల మూలకారణాలను గుర్తించలేకపోతున్నారు. ఎలుకలు, ఇతర క్షీరదాల వల్ల ఇది మనుషులకు ఎక్కువగా సోకుతుంది. వైద్యం చేసే నర్సులు, డాక్టర్లు కూడా ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







