లసా వైరస్.. భయపెడుతున్న మరో ప్రాణాంతక వ్యాధి
- March 06, 2018
అనేక రకాల వ్యాధులకు మందిచ్చే వైద్యుడు సైతం ఈ వ్యాది బారిన పడుతున్నాడు. నైజీరియాలో మొదలైన ఈ ప్రాణాంతక వ్యాధి ప్రపంచమంతా విస్తరిస్తోంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గణాంకాల ప్రకారం జనవరి నుంచి ఇప్పటి వరకు నైజీరియాలో 1000 లసా కేసులు నమోదయ్యాయి. గర్భిణులకు ఈ వ్యాధి సోకితే కడుపులోని బిడ్డ చనిపోవడం జరుగుతోంది. ఈ వ్యాధికి ఇంత వరకు వ్యాక్సిన్ కనిపెట్టలేక పోతున్నారు వైద్యులు. శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం చూపిస్తున్న ఈ వ్యాధి శరీరంలోని రక్తనాళాలను ధ్వంసం చేస్తోంది.
జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కూడా మలేరియా, డెంగ్యూ వ్యాధి లక్షణాల మాదిరిగానే ఉంటుంది. ఈ వ్యాధిని నిర్థారించే ల్యాబ్లు చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 90మంది మృత్యువాత పడ్డారు. నైజీరియా తరువాత ఈ వ్యాధి పశ్చిమాఫ్రికా దేశాలకు కూడా విస్తరిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ఇది విస్తరిస్తోందని తెలిసినా వ్యాధి ప్రభలడానికి గల మూలకారణాలను గుర్తించలేకపోతున్నారు. ఎలుకలు, ఇతర క్షీరదాల వల్ల ఇది మనుషులకు ఎక్కువగా సోకుతుంది. వైద్యం చేసే నర్సులు, డాక్టర్లు కూడా ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







