పాకిస్తానీ ఖైదీ కోసం బ్లడ్ మనీ చెల్లించిన నలుగురు డోనర్స్
- March 07, 2018
రాస్ అల్ ఖైమా:నలుగురు 'గుడ్ సమరిటన్స్', పాకిస్తానీ ఖైదీ కోసం 100,000 దిర్హామ్లను బ్లడ్ మనీగా చెల్లించేందుకు ముందుకొచ్చారు. పాకిస్తానీ ఖైదీకి సంబంధించిన విషయాన్ని తెలుసుకుని, నలుగురు అజ్ఞాత డోనర్స్ ఈ మొత్తాన్ని సమీకరించారు. ఇందులో ఒకరు 60,000, మరొకరు 20,000 చెల్లించగా, మరో ఇద్దరు 10,000 దిర్హామ్ల చొప్పున హాట్లైన్ ద్వారా అందించారు. ఓ వ్యక్తి హత్య కేసులో 40 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తి జైల్లో మగ్గుతున్నాడు. హజి ప్రమాదవశాత్తూ ట్రక్ని, ఓ వ్యక్తిపైకి ఎక్కించేశాడు. ఈ ఘటన ఏడు నెలల క్రితం జరిగింది. రస్ అల్ ఖైమాలోని ఓ ప్రాంతంలో హజి తన ట్రక్ని పార్కింగ్ చేశాడు. ఆ ట్రక్ కింద ఆసియాకి చెందిన వ్యక్తి రెస్ట్ తీసుకుంటుండగా, అది గమనించని హజి, వాహనాన్ని నడపడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం 100,000 బ్లడ్ మనీని బాధిత కుటుంబానికి చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









