శ్రీలంక:సోషల్‌ మీడియాపై నిషేధం

- March 07, 2018 , by Maagulf
శ్రీలంక:సోషల్‌ మీడియాపై నిషేధం

శ్రీలంక:కొద్దిరోజులుగా శ్రీలంకలో ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పటికీ అల్లర్లు, హింస ఆగడం లేదు.. కొందరు వ్యక్తులు ఈ హింసాకాండను సామజిక మాధ్యమాలు ఫేస్బుక్ , వాట్సాప్ లలో పోస్ట్ చేస్తున్నారు దాంతో అల్లర్లు మరింత పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో దేశం మొత్తం సోషల్ మీడియాను నిషేధిస్తూ శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.సోషల్ మీడియా ద్వారా అల్లర్లు మరింత జఠిలమయ్యే అవకాశముందని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  బుధవారం నాడు కూడా పలు చోట్ల బౌద్ధులు-ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. బౌద్ధ సంఘాలకు చెందిన యువకులు కొందరు.. మసీదులను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com