పిజీ పూర్తిచేసిన విద్యార్ధులకు కేసీఆర్ అందించిన శుభవార్త
- March 08, 2018
పిజీ పూర్తిచేసిన మెడికల్ విద్యార్ధులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ శుభవార్త చెప్పారు.మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఖచ్చితంగా ఏడాది పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధన తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు సీఎం వెల్లడించారు.
ఈ నిర్ణయం ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని, ఈ ఏడాది పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయకున్నా, వారి విద్యార్హతలను రిజిష్టర్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలినంత సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికనే నియమిస్తున్నందున, మెడికల్ విద్యార్థులతో పని చేయించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







