భారత్ పర్యటనకు వచ్చిన ఫ్రెంచ్ అధ్యక్షుడు
- March 08, 2018
పారిస్: ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ భారత్లో అధికార పర్యటన నిమిత్తం గురువారం ఇక్కడికి చేరుకున్నారు. ఆదివారం నాడు న్యూఢిల్లీలో జరుగనున్న సౌర విద్యుత్ సదస్సుకు హాజరు కానున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్, తరువాత ప్రధాని మోడీతో భేటీ అవుతారని ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. భార్య బ్రిగెట్టితో సహా భారత్ వచ్చిన మాక్రాన్ ఆదివారం నాడు ఆగ్రాలోని తాజ్ మహల్ను సతీసమేతంగా సందర్శించనున్నారు. సోమవారం నాడు ఆయన వారణాసి నగరాన్ని సందర్శించి అక్కడ గంగశుద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిస్తారు. దీనితో పాటు తమ దేశానికి చెందిన ఎయిర్బస్ హెలీకాప్టర్లు, స్కార్పియన్ జలాంతర్గాముల వంటి వాటి విక్రయాలకు సంబంధించి ఆయన చర్చలు జరుపనున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







