భారత్‌ పర్యటనకు వచ్చిన ఫ్రెంచ్‌ అధ్యక్షుడు

- March 08, 2018 , by Maagulf
భారత్‌ పర్యటనకు వచ్చిన ఫ్రెంచ్‌ అధ్యక్షుడు

పారిస్‌: ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ భారత్‌లో అధికార పర్యటన నిమిత్తం గురువారం ఇక్కడికి చేరుకున్నారు. ఆదివారం నాడు న్యూఢిల్లీలో జరుగనున్న సౌర విద్యుత్‌ సదస్సుకు హాజరు కానున్న ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, తరువాత ప్రధాని మోడీతో భేటీ అవుతారని ఫ్రెంచ్‌ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. భార్య బ్రిగెట్టితో సహా భారత్‌ వచ్చిన మాక్రాన్‌ ఆదివారం నాడు ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ను సతీసమేతంగా సందర్శించనున్నారు. సోమవారం నాడు ఆయన వారణాసి నగరాన్ని సందర్శించి అక్కడ గంగశుద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిస్తారు. దీనితో పాటు తమ దేశానికి చెందిన ఎయిర్‌బస్‌ హెలీకాప్టర్లు, స్కార్పియన్‌ జలాంతర్గాముల వంటి వాటి విక్రయాలకు సంబంధించి ఆయన చర్చలు జరుపనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com