తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు
- March 08, 2018
దిల్లీ: అంతర్జాతీయ బలహీన సంకేతాల ప్రభావంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర పడిపోయింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో గురువారం నాటి మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 220 తగ్గి రూ. 31,450కి చేరింది. అటు వెండి కూడా నేడు బంగారం బాటలోనే పయనించింది. రూ. 400 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 39,500కు పడిపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గినట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. న్యూయార్క్లో బుధవారం నాటి మార్కెట్లో పసిడి ధర 0.70శాతం తగ్గి ఔన్సు ధర 1,324.90డాలర్లు పలికింది. వెండి కూడా 0.53శాతం పడిపోయి ఔన్సు ధర 16.47గా ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







