తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు
- March 08, 2018
దిల్లీ: అంతర్జాతీయ బలహీన సంకేతాల ప్రభావంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర పడిపోయింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో గురువారం నాటి మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 220 తగ్గి రూ. 31,450కి చేరింది. అటు వెండి కూడా నేడు బంగారం బాటలోనే పయనించింది. రూ. 400 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 39,500కు పడిపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గినట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. న్యూయార్క్లో బుధవారం నాటి మార్కెట్లో పసిడి ధర 0.70శాతం తగ్గి ఔన్సు ధర 1,324.90డాలర్లు పలికింది. వెండి కూడా 0.53శాతం పడిపోయి ఔన్సు ధర 16.47గా ఉంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









