అమెరికా డ్రోన్ దాడుల్లో గూగుల్కూ పాత్ర
- March 08, 2018
వాషింగ్టన్ : అమెరికా అక్రమంగా సాగిస్తున్న డ్రోన్ దాడుల కార్యక్రమంలో తాము కూడా సహకరించామని గూగుల్ అంగీకరించింది. ఆ దాడుల లక్ష్యాలను గుర్తించడానికి అవసరమైన సాఫ్ట్వేర్ను తాము అందించామని గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ స్పష్టం చేసింది. 2009లో అమెరికా డ్రోన్ దాడి కార్యక్రమాన్ని చేపట్టినప్పటి నుండి దాదాపు 3వేల మందిని హతమార్చినట్లు అమెరికా చెప్పుకుంటోంది. డ్రోణ్ దాడిలో లక్ష్యమైన ఒక వ్యక్తితో పాటు 9మంది పక్కవారు కూడా మరణించారని అంతర్గత సైనిక పత్రాల్లో వెల్లడవుతోంది. అంటే దీన్నిబట్టి యెమెన్, సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్ల్లో అమెరికా సైన్యం సాగించిన తీవ్రవాద దాడుల్లో మృతుల సంఖ్య వేల సంఖ్యలోనే వుందని వెల్లడవుతోంది. డ్రోణ్ దాడుల కార్యక్రమంలో గూగుల్ పాత్ర వుండడంతో అమెరికా సైన్యం నేరపూరిత కార్యకలాపాల్లో కూడా దానికి భాగమున్నట్లు స్ఫష్టమైంది. గత వారం అంతర్గత మెమోలో గూగుల్ ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో గూగుల్ ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







