అమెరికా డ్రోన్ దాడుల్లో గూగుల్కూ పాత్ర
- March 08, 2018
వాషింగ్టన్ : అమెరికా అక్రమంగా సాగిస్తున్న డ్రోన్ దాడుల కార్యక్రమంలో తాము కూడా సహకరించామని గూగుల్ అంగీకరించింది. ఆ దాడుల లక్ష్యాలను గుర్తించడానికి అవసరమైన సాఫ్ట్వేర్ను తాము అందించామని గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ స్పష్టం చేసింది. 2009లో అమెరికా డ్రోన్ దాడి కార్యక్రమాన్ని చేపట్టినప్పటి నుండి దాదాపు 3వేల మందిని హతమార్చినట్లు అమెరికా చెప్పుకుంటోంది. డ్రోణ్ దాడిలో లక్ష్యమైన ఒక వ్యక్తితో పాటు 9మంది పక్కవారు కూడా మరణించారని అంతర్గత సైనిక పత్రాల్లో వెల్లడవుతోంది. అంటే దీన్నిబట్టి యెమెన్, సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్ల్లో అమెరికా సైన్యం సాగించిన తీవ్రవాద దాడుల్లో మృతుల సంఖ్య వేల సంఖ్యలోనే వుందని వెల్లడవుతోంది. డ్రోణ్ దాడుల కార్యక్రమంలో గూగుల్ పాత్ర వుండడంతో అమెరికా సైన్యం నేరపూరిత కార్యకలాపాల్లో కూడా దానికి భాగమున్నట్లు స్ఫష్టమైంది. గత వారం అంతర్గత మెమోలో గూగుల్ ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో గూగుల్ ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







