ఇతని ఆచూకీ చెప్పిన వారికి.. రూ.32.56 కోట్లు

- March 09, 2018 , by Maagulf
ఇతని ఆచూకీ చెప్పిన వారికి.. రూ.32.56 కోట్లు

తెహ్రీక్ యే తాలిబన్ ఉగ్రవాది మౌలానా ఫజలుల్లాపై అమెరికా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఎవరైనా అతని గురించి సమాచారమిస్తే రూ.32.56 భారీ నజరానా ఇస్తామని తెలిపింది. గతకొన్నేళ్లుగా ఉగ్రవాది మౌలానా ఫజలుల్లాపై అమెరికా పలు విధాలుగా సమాచారం సేకరించాలని ప్రయత్నించింది. కానీ అవేవి ఫలించలేదు దీంతో ఈ ప్రకటన చేసింది అమెరికా. కాగా 2016 లో పెషావర్ ఆర్మీ స్కూల్‌పై జరిగిన దాడిలో సూత్రధారిగా ఉన్నాడు మౌలానా ఫజలుల్లా.. ఆ దాడిలో సుమారు 150 మంది చిన్నారులు చనిపోయారు. అంతేకాదు 2011 లో నోబెల్ శాంతి అవార్డు గ్రహీత మలాలా పై కూడా దాడి చేసింది ఈ ఉగ్రవాదే.. అలాగే ఇతనితోపాటు మరో ఇద్దరిపై కూడా అమెరికా నజరానా ప్రకటించింది.  లష్కరే సంస్థకు చెందిన అబ్దుల్ వాలీ, మంగల్ భాగ్‌లను పట్టిస్తే 20 కోట్లు అందజేస్తామని ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com