హిమాలయాలకు పయనమవుతున్న తలైవా
- March 09, 2018
చెన్నై: అగ్ర కథానాయకుడు రజనీకాంత్ శనివారం హిమాలయాలకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధులు నిర్ధారించారు. 'తలైవా హిమాలయాలకు వెళ్తున్నారు. ఈ వార్త నిజమే' అని రజనీ ప్రతినిధి రియాజ్ అహ్మద్ ట్వీట్ చేశారు. మహా అవతార్ బాబాజీ నివసించాడని అందరూ విశ్వసించే హిమాలయాల్లోని దునగిరి అనే ప్రాంతంలో ఉన్న గుహల్లో రజనీ ధ్యానం చేయడానికి తరచూ వెళ్తుంటారు. గత ఏడాది రజనీ తన స్నేహితులతో కలిసి హిమాలయాల్లో ధ్యాన మందిరాన్ని నిర్మించారు. పరమహంస యోగానంద స్థాపించిన వైఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మందిరాన్ని ఏర్పాటు చేశారు. రజనీ నటించిన '2.ఓ' విడుదలకు సిద్ధమవుతోంది. ఆయన గ్యాంగ్స్టర్ పాత్ర పోషించిన 'కాలా' ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో తలైవా-కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా షురూ కాబోతోంది. మరోపక్క రజనీ రాజకీయ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారు. దీని కోసం ఆయన బృందం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







