హిమాలయాలకు పయనమవుతున్న తలైవా

- March 09, 2018 , by Maagulf
హిమాలయాలకు పయనమవుతున్న తలైవా

చెన్నై: అగ్ర కథానాయకుడు రజనీకాంత్ శనివారం హిమాలయాలకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధులు నిర్ధారించారు. 'తలైవా హిమాలయాలకు వెళ్తున్నారు. ఈ వార్త నిజమే' అని రజనీ ప్రతినిధి రియాజ్‌ అహ్మద్‌ ట్వీట్‌ చేశారు. మహా అవతార్‌ బాబాజీ నివసించాడని అందరూ విశ్వసించే హిమాలయాల్లోని దునగిరి అనే ప్రాంతంలో ఉన్న గుహల్లో రజనీ ధ్యానం చేయడానికి తరచూ వెళ్తుంటారు. గత ఏడాది రజనీ తన స్నేహితులతో కలిసి హిమాలయాల్లో ధ్యాన మందిరాన్ని నిర్మించారు. పరమహంస యోగానంద స్థాపించిన వైఎస్‌ఎస్‌ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మందిరాన్ని ఏర్పాటు చేశారు. రజనీ నటించిన '2.ఓ' విడుదలకు సిద్ధమవుతోంది. ఆయన గ్యాంగ్‌స్టర్‌ పాత్ర పోషించిన 'కాలా' ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో తలైవా-కార్తిక్‌ సుబ్బరాజ్‌ కాంబినేషన్లో ఓ సినిమా షురూ కాబోతోంది. మరోపక్క రజనీ రాజకీయ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారు. దీని కోసం ఆయన బృందం ఏర్పాట్లు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com