గ్యాస్ సిలెండర్ పేలడంతో ఐదుగురు ఆసుపత్రి పాలు
- March 10, 2018
దుబాయ్ : ఎడారి దేశంలో నలభీమపాకంలో నిమగ్నమైన ఆ అయిదుగురు కార్మికులు గ్యాస్ సిలెండర్ లీకేజీని గమనించలేదు ..అంతే ఒక్కసారిగా పేలడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అల్ జార్ఫ్ పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా ఆసియా దేశాలకు చెందిన వలస కార్మికులని పోలీసులు పేర్కొంటున్నారు. వీరిని వెంటనే షేక్ ఖలీఫా ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం గం.3-20 నిమిషాలకు తమకు ఈ పేలుడు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. వెంటనే సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి బాధితులను రక్షించే యత్నం చేసినట్లు ఆ అధికారులు తెలిపారు. సిలెండర్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు చెప్పారు. సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని కంపెనీల యజమాన్యాలను పిలిచి మీటింగ్ ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పారు. గ్యాస్ సిలెండర్లు నింపేటప్పుడు వాటిని ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి సూచించామన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









