వేధింపులకు గురైన గృహ సేవకురాళ్లకు న్యాయం కోసం కొత్త చట్టం
- March 10, 2018
అబుదాబి: పిల్లా పాపాలను వదిలి దేశం కానీ దేశం వెళ్లిన గృహ సేవకురాళ్లకు న్యాయం కోసం ఓ కొత్త చట్టంఅబుదాబి ప్రభుత్వం తీసుకురానుంది . దీని అమలు కోసం ప్రత్యేకమైన ఓ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయనుంది. ఈ ట్రిబ్యునల్ ద్వారా వేధింపులు, ఇతర నేరాలకు గురైన బాధిత మహిళలకు సంబంధించిన కేసులలో సత్వర విచారణ జరగనుంది. తద్వారా బాధిత మహిళలకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో ఈ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉపప్రధాని, అధ్యక్షవ్యవహారాల మంత్రి, అబుదాబి జ్యూడిషియల్ అధిపతి షేక్ మన్షూర్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఓ తీర్మానాన్ని బుధవారం ప్రవేశపెట్టారు. ఈ చట్టం చట్టం అమల్లోకి వస్తే పని మనుషుల వేధింపుల కేసుల విచారణను ప్రత్యేకంగా చేపడుతారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు. బతుకుదెరువు కోసం ఆసియా దేశాలకు చెందిన అనేక మంది మహిళలు గల్ఫ్ దేశాలు వెళ్తున్నారు. యజమానుల చిత్రహింసలకు గురువుతున్నారు. బాధితుల్లో భారత మహిళల సంఖ్య కూడా అధికంగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ చట్టం అమల్లోకి వస్తే అన్యాయానికి గురైన మహిళలకు ఎంతో కొంత మేలు జరగనుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









