వేధింపులకు గురైన గృహ సేవకురాళ్లకు న్యాయం కోసం కొత్త చట్టం
- March 10, 2018
అబుదాబి: పిల్లా పాపాలను వదిలి దేశం కానీ దేశం వెళ్లిన గృహ సేవకురాళ్లకు న్యాయం కోసం ఓ కొత్త చట్టంఅబుదాబి ప్రభుత్వం తీసుకురానుంది . దీని అమలు కోసం ప్రత్యేకమైన ఓ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయనుంది. ఈ ట్రిబ్యునల్ ద్వారా వేధింపులు, ఇతర నేరాలకు గురైన బాధిత మహిళలకు సంబంధించిన కేసులలో సత్వర విచారణ జరగనుంది. తద్వారా బాధిత మహిళలకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో ఈ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉపప్రధాని, అధ్యక్షవ్యవహారాల మంత్రి, అబుదాబి జ్యూడిషియల్ అధిపతి షేక్ మన్షూర్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఓ తీర్మానాన్ని బుధవారం ప్రవేశపెట్టారు. ఈ చట్టం చట్టం అమల్లోకి వస్తే పని మనుషుల వేధింపుల కేసుల విచారణను ప్రత్యేకంగా చేపడుతారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు. బతుకుదెరువు కోసం ఆసియా దేశాలకు చెందిన అనేక మంది మహిళలు గల్ఫ్ దేశాలు వెళ్తున్నారు. యజమానుల చిత్రహింసలకు గురువుతున్నారు. బాధితుల్లో భారత మహిళల సంఖ్య కూడా అధికంగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ చట్టం అమల్లోకి వస్తే అన్యాయానికి గురైన మహిళలకు ఎంతో కొంత మేలు జరగనుంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







