వేధింపులకు గురైన గృహ సేవకురాళ్లకు న్యాయం కోసం కొత్త చట్టం
- March 10, 2018
అబుదాబి: పిల్లా పాపాలను వదిలి దేశం కానీ దేశం వెళ్లిన గృహ సేవకురాళ్లకు న్యాయం కోసం ఓ కొత్త చట్టంఅబుదాబి ప్రభుత్వం తీసుకురానుంది . దీని అమలు కోసం ప్రత్యేకమైన ఓ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయనుంది. ఈ ట్రిబ్యునల్ ద్వారా వేధింపులు, ఇతర నేరాలకు గురైన బాధిత మహిళలకు సంబంధించిన కేసులలో సత్వర విచారణ జరగనుంది. తద్వారా బాధిత మహిళలకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో ఈ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉపప్రధాని, అధ్యక్షవ్యవహారాల మంత్రి, అబుదాబి జ్యూడిషియల్ అధిపతి షేక్ మన్షూర్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఓ తీర్మానాన్ని బుధవారం ప్రవేశపెట్టారు. ఈ చట్టం చట్టం అమల్లోకి వస్తే పని మనుషుల వేధింపుల కేసుల విచారణను ప్రత్యేకంగా చేపడుతారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు. బతుకుదెరువు కోసం ఆసియా దేశాలకు చెందిన అనేక మంది మహిళలు గల్ఫ్ దేశాలు వెళ్తున్నారు. యజమానుల చిత్రహింసలకు గురువుతున్నారు. బాధితుల్లో భారత మహిళల సంఖ్య కూడా అధికంగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ చట్టం అమల్లోకి వస్తే అన్యాయానికి గురైన మహిళలకు ఎంతో కొంత మేలు జరగనుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







