భారత్-ఫ్రాన్స్ మధ్య 14 కీలక ఒప్పందాలు
- March 10, 2018
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ 4 రోజుల భారత పర్యటనలో భాగంగా భారత్-ఫ్రాన్స్ మధ్య 14 కీలక ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక చర్చల అనంతరం సీఈఓల ఫోరంకు హాజరైన ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు సమక్షంలో 14 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భారత రాజ్యాంగంలో వేళ్లూనుకున్నాయని ఈ సందర్భంగా మోడీ వ్యాఖ్యానించారు.
హిందూ మహాసముద్రంలో విస్తృత సహకారానికి ఇరు దేశాధినేతలు తమ విజన్ ప్రకటించారు. మైగ్రెంట్ మొబిలిటీ, పార్టనర్షిప్ను పటిష్టపరిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ రక్షణ సహకారంలో నూతన చరిత్రను ఆవిష్కరించే ఒప్పందం కుదరడంపై హర్షం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టాలని మోడీ ఫ్రాన్స్ను ఆహ్వానించారు.
భారత్ - ఫ్రాన్స్ మధ్య రక్షణ సహకారానికి కీలక ప్రాధాన్యం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు తెలిపారు. ఉగ్రవాదంపై రెండు దేశాలు పోరాడాలాని నిర్ణయించినట్టు చెప్పారు. తర్వాత ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్తో భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీలోని బికనీర్ హౌస్లో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. భారత్- ఫ్రాన్స్ దేశాల ప్రజలు, విద్యార్థుల రాకపోకలు రెండు దేశాల్లో మరింత పెరగాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!