సచిన్ సినిమాకు అవార్డు
- March 11, 2018
ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సచిన్ -ఏ బిలియన్ డ్రీమ్స్ చిత్రానికి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. ది ఎక్లాడ్ గ్లోబల్ ఫిల్మ్ కాంపిటీషన్-2018లో భాగంగా 2017లో వచ్చిన ఏ బిలియన్ డ్రీమ్స్ సినిమా ఎక్సలెన్స్ అవార్డు దక్కించుకుంది. ఈ విషయాన్ని బాలీవుడు విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సచిన్ క్రికెట్ కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితంతో తెరకెక్కిన చిత్రానికి జేమ్స్ ఎర్సీన్ దర్శకత్వం వహించగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఐదు భాషలు హిందీ, ఇంగ్లీష్, మరాఠి, తెలుగు, తమిళంలో 2017 మే 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు అవార్డు రావడంతో అభిమానులు సచిన్కు అభినందనలు తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









