'కిరాక్ పార్టీ' ఆడియో విడుదల
- March 11, 2018
హీరో నిఖిల్ కథానాయకుడుగా కన్నడలో వచ్చిన 'కిరిక్ పార్టీ' ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎకె ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలుగులో 'కిరాక్ పార్టీ' గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే , సిమ్రాన్ పరీంజా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శరఱ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు..
యువదర్శకుడు సుధీర్వర్మ స్క్రీన్ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూర్చారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతునన ఈచిత్రం ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.. ఈచిత్రం ఆడియో వేడుకను విజయవాడలోనిఉషారామా ఇంజనీరింగ్కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అల్లరి నరేష్ బిగ్ సిడిని ఆవిష్కరించారు..
తొలిసిడిని నిర్మాతల్లో ఒకరైన రామబ్రహ్మం సుంకర అందుకున్నారు. చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడారు.. ఈచిత్రాన్ని మార్చి 16న విడుదల చేయనున్నామన్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ నిఖిల్ను చూసినపుడల్లా డ్యూరో సెల్ బ్యాటరీ గుర్తొస్తుందని, మా ఆహుతి ప్రసాద్ గారి అబ్బాయి కార్తీక్ ఈ చిత్రంలో నటించటం చాలా సంతోషంగా ఉందన్నారు.. కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు నిఖిల్, హీరోయిన్ సంయుక్త హెగ్డే, చిత్ర దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తదితరులు మాట్లాడారు. ఈచిత్రానికి అజనీష్ లోక్నాధ్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!







