'కిరాక్ పార్టీ' ఆడియో విడుదల
- March 11, 2018
హీరో నిఖిల్ కథానాయకుడుగా కన్నడలో వచ్చిన 'కిరిక్ పార్టీ' ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎకె ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలుగులో 'కిరాక్ పార్టీ' గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే , సిమ్రాన్ పరీంజా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శరఱ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు..
యువదర్శకుడు సుధీర్వర్మ స్క్రీన్ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూర్చారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతునన ఈచిత్రం ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.. ఈచిత్రం ఆడియో వేడుకను విజయవాడలోనిఉషారామా ఇంజనీరింగ్కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అల్లరి నరేష్ బిగ్ సిడిని ఆవిష్కరించారు..
తొలిసిడిని నిర్మాతల్లో ఒకరైన రామబ్రహ్మం సుంకర అందుకున్నారు. చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడారు.. ఈచిత్రాన్ని మార్చి 16న విడుదల చేయనున్నామన్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ నిఖిల్ను చూసినపుడల్లా డ్యూరో సెల్ బ్యాటరీ గుర్తొస్తుందని, మా ఆహుతి ప్రసాద్ గారి అబ్బాయి కార్తీక్ ఈ చిత్రంలో నటించటం చాలా సంతోషంగా ఉందన్నారు.. కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు నిఖిల్, హీరోయిన్ సంయుక్త హెగ్డే, చిత్ర దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తదితరులు మాట్లాడారు. ఈచిత్రానికి అజనీష్ లోక్నాధ్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









