ముంబైలో హైటెన్షన్..!
- March 12, 2018
ముంబైలో హైటెన్షన్ మొదలయ్యింది. రైతు సమస్యలను పరిష్కరించాలంటూ ఆరు రోజుల పాటు 180 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ముంబై చేరుకున్న అన్నదాతలు.. మరికాసేపట్లో మహారాష్ట్ర అసెంబ్లీని ముట్టడించనున్నారు. ఆజాద్ మైదానంలో దాదాపు 50 వేల మంది రైతులు నేతల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. పరీక్షలు జరుగుతుండడంతో.. ఉదయం 11 గంటల తర్వాత మైదానం నుంచి కదులుతామంటూ ఇప్పటికే ప్రకటించారు రైతు సంఘం నేతలు. అటు.. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. రైతు సంఘం నేతలను చర్చల కోసం విధాన్ భవన్కు ఆహ్వానించారు.
విదర్భ నుంచి రైతుల యాత్ర మొదలైనప్పటి నుంచీ ఎలాంటి నిర్భంధాలు విధించని మహారాష్ట్ర ప్రభుత్వం, ఆజాద్ మైదానం నుంచి మాత్రం వారిని బయటకు రానివ్వకూడదని భావిస్తోంది. అసెంబ్లీను చుట్టుముడితే, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు పోలీసులు. అయితే, ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న అఖిల భారత కిసాన్ సభ మాత్రం, ముంబై వాసులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వమని చెబుతోంది. అందరికీ అన్నం పెట్టే రైతు సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఆందోళనలకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరింది. ముఖ్యమంత్రితో చర్చలు విఫలమైతే గనక, అసెంబ్లీ ముట్టడికి రైతులు వెళ్లే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







