ఉగాదికి నాగ్-నాని సినిమా షురూ!
- March 12, 2018
కింగ్ అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ పతాకంపై టి.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది . ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 18వ తేదీ (ఉగాది పండగ రోజు) నుంచి జరగనుందని చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్ తెలిపారు.
అమెరికాలో మ్యూజిక్ సిట్టింగ్స్ :
ఈ సందర్భంగా సి.అశ్వనీదత్ మాట్లాడుతూ.. ' మా వైజయంతి పతాకంపై మణిశర్మ చేసిన సినిమాలన్నీ మ్యూజికల్గా పెద్ద హిట్స్ అయ్యాయి. ఈ సినిమాని కూడా హిట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమాలోని పాటల్ని మణిశర్మ కంపోజ్ చేస్తున్నారు. మూడు పాటలకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ అక్కడ జరుగుతున్నాయి. మార్చి 18వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. మా సంస్థలో ఎన్నో మల్టీస్టారర్స్ వచ్చాయి. అవన్నీ కమర్షియల్గా ఘన విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు నాగార్జున, నాని కాంబినేషన్లో చేస్తున్న మల్టీస్టారర్ కూడా పెద్ద హిట్టై, మరింత మంచి పేరు తెస్తుంది' అని ఆశాభావం వ్యక్తంచేశారు. టి.శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. 'వినోదాత్మకంగా సాగే విభిన్నమైన కథ ఇది. నాగార్జున, నాని వంటి హీరోలతో వైజయంతి పతాకంలో ఈ మల్టీస్టారర్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది' అని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







