చర్చిపై పిడుగు..16మంది మృతి, 140 మందికి గాయాలు
- March 12, 2018
పిడుగుపాటు కారణంగా ఒక చర్చిలో 16మంది చనిపోయిన సంఘటన రువాండాలోని యారుగురులో చోటు చేసుకుంది. ఘటనలో గాయాలపాలైనవారి సంఖ్య 140వరకు ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది.
ప్రత్యేక ప్రార్థనల కోసం కొన్ని వందలమది శనివారం చర్చికి వచ్చారు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలోనే చర్చిపై పిడుగు పడింది. దీంతో చర్చిలో చాలామంది సజీవ దహనమయ్యారు. మిగతావారు హాహాకారాలు చేస్తూ భయంతో బిక్కచచ్చిపోయారు.
పిడుగుపాటుకు గురికాకుండా చర్చిలో ఎలాంటి ఏర్పాట్లు లేవని, కనీసం విద్యుత్ సదుపాయం కూడా అక్కడ లేదని చెబుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









