లక్ష్మీస్ ఎన్టీఆర్ పై సంచలన ప్రకటన చేసిన:ఆర్.జి.వి
- March 16, 2018
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.. ఇక బయోపిక్ లను తనదైన శైలిలో తెరకెక్కిస్తాడు.. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ అంటూ ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు.
దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరు పెట్టాడు.. ఆ సినిమాను వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మిస్తాడు అని కూడా ప్రకటించాడు. తాజాగా వర్మ అసహనం వ్యక్తం చేస్తూ..ఆయనతో సినిమా తీయడం లేదు అని సంచలన ప్రకట చేశారు. ఈ విషయం తెలియజేస్తూ.. ఓ వీడియో లింక్ ను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు వర్మ.. రాకేశ్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దలు అని.. ఈ అబద్ధాలు ఎవర్ని మోసం చెయ్యడానికి అనేది ఆయనకే తెలియాలి అని.. ఇక నుంచి ఆయనకు నాకు ఏ విధమైన సంబంధం లేదని ఈ నోట్ రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. అంతేకాదు. తను నాగార్జున తో చేస్తున్న ఆఫీసర్ సినిమా తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం 2018 ఏప్రిల్ లో మొదలు పెట్టి.. సెప్టెంబర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రానున్నట్లు చెప్పాడు. మరి ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు నిర్మాత నటులు ఎవరో వర్మ ప్రకటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







