లక్ష్మీస్ ఎన్టీఆర్ పై సంచలన ప్రకటన చేసిన:ఆర్.జి.వి
- March 16, 2018
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.. ఇక బయోపిక్ లను తనదైన శైలిలో తెరకెక్కిస్తాడు.. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ అంటూ ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు.
దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరు పెట్టాడు.. ఆ సినిమాను వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మిస్తాడు అని కూడా ప్రకటించాడు. తాజాగా వర్మ అసహనం వ్యక్తం చేస్తూ..ఆయనతో సినిమా తీయడం లేదు అని సంచలన ప్రకట చేశారు. ఈ విషయం తెలియజేస్తూ.. ఓ వీడియో లింక్ ను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు వర్మ.. రాకేశ్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దలు అని.. ఈ అబద్ధాలు ఎవర్ని మోసం చెయ్యడానికి అనేది ఆయనకే తెలియాలి అని.. ఇక నుంచి ఆయనకు నాకు ఏ విధమైన సంబంధం లేదని ఈ నోట్ రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. అంతేకాదు. తను నాగార్జున తో చేస్తున్న ఆఫీసర్ సినిమా తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం 2018 ఏప్రిల్ లో మొదలు పెట్టి.. సెప్టెంబర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రానున్నట్లు చెప్పాడు. మరి ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు నిర్మాత నటులు ఎవరో వర్మ ప్రకటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!