లక్ష్మీస్ ఎన్టీఆర్ పై సంచలన ప్రకటన చేసిన:ఆర్.జి.వి
- March 16, 2018
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.. ఇక బయోపిక్ లను తనదైన శైలిలో తెరకెక్కిస్తాడు.. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ అంటూ ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు.
దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరు పెట్టాడు.. ఆ సినిమాను వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మిస్తాడు అని కూడా ప్రకటించాడు. తాజాగా వర్మ అసహనం వ్యక్తం చేస్తూ..ఆయనతో సినిమా తీయడం లేదు అని సంచలన ప్రకట చేశారు. ఈ విషయం తెలియజేస్తూ.. ఓ వీడియో లింక్ ను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు వర్మ.. రాకేశ్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దలు అని.. ఈ అబద్ధాలు ఎవర్ని మోసం చెయ్యడానికి అనేది ఆయనకే తెలియాలి అని.. ఇక నుంచి ఆయనకు నాకు ఏ విధమైన సంబంధం లేదని ఈ నోట్ రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. అంతేకాదు. తను నాగార్జున తో చేస్తున్న ఆఫీసర్ సినిమా తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం 2018 ఏప్రిల్ లో మొదలు పెట్టి.. సెప్టెంబర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రానున్నట్లు చెప్పాడు. మరి ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు నిర్మాత నటులు ఎవరో వర్మ ప్రకటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









