దేశాన్ని ఐక్యంగా ఉంచేది కాంగ్రెస్సే:రాహుల్
- March 16, 2018
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని ఐక్యంగా ఉంచగలదని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లగలదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న పార్టీ 84వ ప్లీనరీలో రాహుల్ మాట్లాడారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్కు ఇది తొలి ప్లీనరీ కావడం విశేషం. ప్రజల్లో బీజేపీ ద్వేషాన్ని నింపుతున్నదని, కాంగ్రెస్ పార్టీ ప్రేమను అందిస్తున్నదన్నారు. ఈ దేశం అందరిదన్న అభిప్రాయాన్ని వినిపించనున్నట్లు ఆయన తెలిపారు. అందరి లాభం కోసమే కాంగ్రెస్ ఏదైనా చేస్తుందన్నారు. దేశంలో అసహనం పెరుగుతోందన్నారు. ఈ ప్లీనరీ ద్వారా పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ భావిస్తున్నారు. బీజేపీ పాలనతో దేశం చాలా అలసిపోయిందని, ఓ కొత్త దిశానిర్దేశం కావాలని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని మునుముందుకు తీసుకువెళ్లగలదని రాహుల్ అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!