దేశాన్ని ఐక్యంగా ఉంచేది కాంగ్రెస్సే:రాహుల్

- March 16, 2018 , by Maagulf
దేశాన్ని ఐక్యంగా ఉంచేది కాంగ్రెస్సే:రాహుల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని ఐక్యంగా ఉంచగలదని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లగలదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న పార్టీ 84వ ప్లీనరీలో రాహుల్ మాట్లాడారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్‌కు ఇది తొలి ప్లీనరీ కావడం విశేషం. ప్రజల్లో బీజేపీ ద్వేషాన్ని నింపుతున్నదని, కాంగ్రెస్ పార్టీ ప్రేమను అందిస్తున్నదన్నారు. ఈ దేశం అందరిదన్న అభిప్రాయాన్ని వినిపించనున్నట్లు ఆయన తెలిపారు. అందరి లాభం కోసమే కాంగ్రెస్ ఏదైనా చేస్తుందన్నారు. దేశంలో అసహనం పెరుగుతోందన్నారు. ఈ ప్లీనరీ ద్వారా పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ భావిస్తున్నారు. బీజేపీ పాలనతో దేశం చాలా అలసిపోయిందని, ఓ కొత్త దిశానిర్దేశం కావాలని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని మునుముందుకు తీసుకువెళ్లగలదని రాహుల్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com